భారత్పై విషప్రచారానికి పాక్ అస్త్రం..15 ఎఫ్ఎంలు!
- June 15, 2019కాశ్మీర్లో భారత్పై విషప్రచారం చేసేందుకు పాక్ భారత సరిహద్దుల్లో ఎఫ్ఎం ఛానళ్లను ఏర్పాటు చేసింది. ఈ విషయంపై అప్రమత్తమైన భారత ప్రభుత్వం సరిహద్దుల్లో ఎన్ని ఛానళ్లు చురుగ్గా పనిచేస్తున్నాయో లెక్కలు ఇవ్వమని పేర్కొంది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీ, ముజఫరాబాద్, మిర్పూర్లలో కొత్తగా ఎఫ్ఎం స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇవి ఆర్ఎస్పురా, రాజౌరి, పూంచ్, నౌషెరా ప్రాంతాల్లో కూడా ప్రసారం అవుతున్నాయి. వీటి ద్వారా భారత్కు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని విరివిరిగా ప్రచారం చేస్తుంది. ప్రజాదరణ పొందిన పాటలను ప్రసారం చేస్తూ మధ్యలో పాక్ సైన్యానికి అనుకూలంగా ఉండే అంశాలను ప్రస్తావిస్తున్నారని కేంద్ర నిఘా వర్గాలు, సైన్యం చెబుతున్నాయి. వీటిల్లోని కొన్ని రేడియోస్టేషన్లను ఉగ్రసంస్థలు నిర్వహిస్తుండటం గమనార్హం. మొత్తం 15 రేడియో స్టేషన్లు చురుగ్గా పనిచేస్తున్నాయని భారత వర్గాలు గుర్తించాయి.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం