శేఖర్ కమ్ముల సినిమాలో నటించనున్న నాగ చైతన్య
- June 21, 2019సెన్సిబుల్ ప్రేమ కథా చిత్రాలు తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన తీసే ప్రతీ సినిమాలో ఆ సెన్సిటివ్ నెస్ తో కూడిన ప్రేమ కథ ఉంటుంది. ప్రేమ కథా చిత్రాలను తీయడంలో ఈయనది డిఫరెంట్ స్టైల్. ఆనంద్ సినిమా దగ్గర్నుండి మొన్న వచ్చిన ఫిదా వరకు ఆయన స్టైల్ అంతే. ప్రేక్షకులని కట్టి పడేస్తుంటారు. ఫిదా సినిమా తర్వాత ఆయన దగ్గర నుండి తన నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇంతవరకు క్లారిటీ రాలేదు.
ఈ మధ్య ఒక వార్త బయటకు వచ్చింది. " మజిలీ " చిత్రంతో హిట్ తో జోరు మీదున్న నాగచైతన్య తో తన తర్వాతి సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య కి ప్రేమ కథా చిత్రాలు బాగా కలిసొస్తున్నాయి. "ఏ మాయ చేసావె, మజిలీ "రెండు చిత్రాలు నాగచైతన్య కెరీర్ లో మర్చిపోలేని చిత్రాలుగా నిలిచాయి. ఈ రెండు చిత్రాల్లో సమంత ఉండడం విశేషం.
చైతూ హీరోగా శేఖర్ కమ్ముల ఒక సినిమా చేయనున్నాడనీ, కథానాయికగా సాయిపల్లవి ఎంపిక జరిగిపోయిందనే టాక్ రెండు మూడు రోజులుగా వినిపిస్తోంది. ఈ వార్త నిజమేననే విషయం తాజాగా స్పష్టమైపోయింది. శేఖర్ కమ్ముల - చైతూ కాంబినేషన్ లోని సినిమా నిజమేనంటూ ఒక ప్రకటన వచ్చేసింది. నాయికగా సాయిపల్లవినే ఖరారు చేసేశారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగును సెప్టెంబర్ మొదటివారంలో మొదలెట్టనున్నారు. డిసెంబర్లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టుగా చెప్పారు. ప్రస్తుతం చైతూ 'వెంకీమామ' సినిమా చేస్తున్నాడు. అలాగే శేఖర్ కమ్ముల కూడా కొత్త ఆర్టిస్టులతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత, శేఖర్ కమ్ముల - చైతూ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు. 'ఫిదా' తరువాత శేఖర్ కమ్ములతో సాయిపల్లవి చేస్తోన్న సినిమా కావడంతో అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్