హీరోయిన్ భాగ్యశ్రీ భర్త అరెస్ట్!
- July 03, 2019అలనాటి బాలీవుడ్ ముద్దుగమ్ము భాగ్యశ్రీ.. భర్త హిమాలయ అంబోలీని .. దాసానీని పోలీసులు అరెస్ట్ చేశారు. గాంబ్లింగ్ రాకెట్ కు సంబంధించిన ఆరోపణలతో వ్యాపారవేత్త అయిన హిమాలయను, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సొంత పూచీకత్తుతో బెయిల్ మీద విడుదలచేశారు. భాగ్యశ్రీ ఒకప్పుడు బాలీవుడ్ను ఓ ఊపు ఊపిన కథానాయిక. బాలీవుడ్ లో ఎన్నో సంచలనాలకు నాంది పలికిన ‘మైనే ప్యార్ కియా’ చిత్రంలో నటించి బాగా పాపులయ్యారు ఈ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమపావురాలు’గా డబ్ చేశారు. తెలుగు లో కూడా ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించింది. భాగ్యశ్రీ.. హిమాలయను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. ఆమెకు ఇద్దరు సంతానం. కుమారుడు అభిమన్యు దాసాని ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’అనే సినిమాతో బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చాడు.. ఈ ఏడాది మార్చిలో ఈ మూవీ రిలీజ్ అయింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!