భారత వలసదారుడికి కిడ్నీ ఫెయిల్యూర్
- July 19, 2019బహ్రెయిన్: సల్మానియాలో మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్న భారత వలసదారుడు అబూబాకర్, రెండు కీడ్నీలూ ఫెయిల్ కావడంతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలున్నారు. కుటుంబ పెద్ద తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో, మొత్తం కుటుంబం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. సన్నిహితులు కొంతమేర ధన సహాయం చేసినా అది సరిపోవడంలేదని సోషల్ వర్కర్ షబీర్ చెప్పారు. రమదాన్ మాసం తర్వాతి నుంచి అబూబాకర్ ఆరోగ్యం విషమించిందని, ఆసుపత్రిలో చేర్చగా రెండు కిడ్నీలూ చెడిపోయినట్లు వైద్యులు చెప్పారనీ షబీర్ వెల్లడించారు. తదుపరి వైద్య చికిత్స కోసం ఇండియాకి తరలించడం జరిగిందనీ, అయితే చికిత్స చాలా ఖరీదైంది కావడంతో, బాధిత కుటుంబం సాయం కోరుతోందని షబ్బీర్ వివరించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్