బహ్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

- August 09, 2019 , by Maagulf
బహ్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

బహ్రెయిన్‌:భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహ్రెయిన్‌లో పర్యటించనున్నారు. బహ్రెయిన్‌లోని భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకు ఈ విషయమై పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారం అందినట్లు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెలాఖరులో లేదంటే సెప్టెంబర్‌ మొదటి వారంలో నరేంద్ర మోడీ, బహ్రెయిన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. భారత దేశ ప్రధానిగా రెండో సారి అవకాశం దక్కించుకున్న నరేంద్ర మోడీ రాక కోసం బహ్రెయిన్‌లోని బీజేపీ మద్దతుదారులతోపాటు, భారతీయులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com