యూఏఈలో 'రూపే' కార్డ్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
- August 22, 2019యూఏఈ:మిడిల్ ఈస్ట్లో తొలిసారిగా యూఏఈలో రూపే కార్డ్ అందుబాటులోకి రానుంది. మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ తరహాలోనే ఇండియాకి చెందిన రూపే కార్డ్ పనిచేయనుంది. ప్రధాని నరేంద్రమోడీ, యూఏఈలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ రూపే కార్డ్ని ప్రారంభిస్తారని ఇండియాకి చెందిన టాప్ డిప్లమాట్ ఒకరు వెల్లడించారు. యూఏఈలోని ఇండియన్ అంబాసిడర్ నవ్దీప్ సింగ్ సూరి మాట్లాడుతూ, ఇండియా మరయు యూఏఈ మధ్య ఈ మేరకు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాడింగ్ జరిగిందనీ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలాగే యూఏఈకి చెందిన మెర్క్యురీ పేమెంట్స్ సర్వీసెస్ మధ్య ఈ ఒప్పందం కుదిరిందని తెలిపారు. రీజియన్లో యూఏఈ అతి పెద్ద వైబ్రెంట్ బిజినెస్ హబ్ అనీ, యూఏఈలో ఇండియన్ కమ్యూనిటీ పెద్దయెత్తున వుందనీ, ఈ నేపథ్యంలో రూపే కార్డ్ ఇక్కడ విజయవంతమవుతుందని ఆయన వెల్లడించారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు