యూఏఈలో రుపే కార్డుని ఆవిష్కరించి ఉపయోగించిన ప్రధాని నరేంద్ర మోడీ
- August 24, 2019అబుధాబి:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూఏఈలో రుపే కార్డుని ఆవిష్కరించారు. అబుధాబిలోని ఎమిరేట్స ప్యాలెస్లో రుపే కార్డు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. గల్ఫ్లో యూఏఈ ఈ ఘనతను సాధించిన తొలి దేశంగా రికార్డులకెక్కింది. యూఏఈలోని 21 బిజినెస్ గ్రూప్స్ రుపే కార్డుని అనుమతించనున్నాయి. ఇండియన్ స్వీట్స్ని కొనుగోలు చేసేందుకు నరేంద్ర మోడీ తన రుపే కార్డుని తొలిసారిగా యూఏఈలో వినియోగించి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదిలా వుంటే, యూఏఈకి ప్రతి యేటా 3 మిలియన్ ఇండియన్ టూరిస్టులు వస్తుంటారు. రుపే కార్డు అమల్లోకి రావడంతో వారందరికీ మేలు కలుగుతుందని భావిస్తున్నారు. మాస్టర్, వీసా కార్డుల్లానే రుపే కార్డు అతి పెద్ద పేమెంట్ గేట్ వేగా సేవలు అందిస్తోంది. స్వదేశీ కార్డుగా రుపేకి ఇండియాలో విపరీతమైన క్రేజ్ వున్న విషయం తెల్సిందే.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు