మక్కా, మదీనాలోని 79 హాస్పిటాలిటీ కేంద్రాలు మూసివేత..!!
- March 16, 2025
మక్కా: అవసరమైన లైసెన్స్లు పొందకుండా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినందుకు మక్కా, మదీనాలోని 79 ఆతిథ్య కేంద్రాలకు జరిమానా విధించడంతోపాటు వాటిని పర్యాటక మంత్రిత్వ శాఖ మూసివేయించింది. రమదాన్ మొదటి రెండు వారాల్లో ఉల్లంఘనలకు పాల్పడ్డ మక్కాలోని 58 ఆతిథ్య కేంద్రాలు, మదీనాలో 21 ఆతిథ్య సౌకర్యాలకు మొత్తం SR 500,000 జరిమానాలు విధించింది.
పర్యాటక చట్టం మరియు నిబంధనలను ఉల్లంఘించే కేంద్రాలపై చట్టబద్ధమైన జరిమానాలను విధిస్తూనే ఉంటామని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ జరిమానాలు SR1 మిలియన్ వరకు ఉంటాయని, మూసివేత లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. అన్ని టూరిస్ట్ హాస్పిటాలిటీ కేంద్రాలు పర్యాటక చట్టం, దాని నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని.. ఆపరేషన్కు ముందు అవసరమైన లైసెన్స్లను పొందాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మరింత సమాచారంకోసం నంబర్ 930 కు కాల్ చేయాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









