Dh35వేల విలువైన నకిలీ బ్రాస్లెట్లను Dh125,000కి విక్రయించిన స్కామర్..!!
- March 16, 2025
యూఏఈ: ఇటీవల ఒక ఆసియా వ్యక్తి హై-ఎండ్ ఒరిజినల్స్ అని చెప్పి Dh35,000 విలువైన నకిలీ బ్రాస్లెట్లను Dh125,000కి విక్రయించి ఒక లగ్జరీ రిటైలర్ను మోసం చేశాడు. కోర్టు అతనికి Dh90,000 నష్టపరిహారం చెల్లించాలని దుబాయ్ వాణిజ్య కోర్టు ఆదేశించింది. గత సంవత్సరం మోసగాడు తన నైఫ్ బ్రాంచ్లోని రిటైలర్ను సంప్రదించి, మొత్తం Dh125,000కి మూడు ప్రీమియం-బ్రాండ్ బ్రాస్లెట్లను అమ్ముతానని చెప్పినప్పుడు ఈ స్కామ్ జరిగింది. అతని మాటలు నమ్మి, కంపెనీ కొనుగోలును పూర్తి చేసింది. తరువాత నిపుణులకు చూపించగా, సదరు వస్తువులు నకిలీవని, అవి కేవలం Dh35,000 విలువ మాత్రమే ఉంటావని నిర్ధారించారు. ఒక బ్రాస్లెట్లో నకిలీ హాల్మార్క్ ఉందని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. దాని 41 గ్రాముల 18-క్యారెట్ల బంగారం ఆధారంగా, దాని నిజమైన విలువ Dh15,000 మాత్రమే అని అంచనా వేశారు. మిగిలిన రెండు కూడా లగ్జరీ బ్రాండ్లకు ఎటువంటి సంబంధం లేనివని నిర్ధారించారు.
ఫోరెన్సిక్ ప్రయోగశాల నివేదిక ఆధారంగా.. నిందితుడు వాణిజ్య మోసానికి పాల్పడ్డాడని, రిటైలర్ను తప్పుదారి పట్టించాడని, ఆర్థిక నష్టాన్ని కలిగించాడని కోర్టు తీర్పు ఇచ్చింది. స్కామర్ తన బాధితుడికి Dh90,000.. 5 శాతం వడ్డీతో చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







