Dh35వేల విలువైన నకిలీ బ్రాస్లెట్లను Dh125,000కి విక్రయించిన స్కామర్..!!
- March 16, 2025
యూఏఈ: ఇటీవల ఒక ఆసియా వ్యక్తి హై-ఎండ్ ఒరిజినల్స్ అని చెప్పి Dh35,000 విలువైన నకిలీ బ్రాస్లెట్లను Dh125,000కి విక్రయించి ఒక లగ్జరీ రిటైలర్ను మోసం చేశాడు. కోర్టు అతనికి Dh90,000 నష్టపరిహారం చెల్లించాలని దుబాయ్ వాణిజ్య కోర్టు ఆదేశించింది. గత సంవత్సరం మోసగాడు తన నైఫ్ బ్రాంచ్లోని రిటైలర్ను సంప్రదించి, మొత్తం Dh125,000కి మూడు ప్రీమియం-బ్రాండ్ బ్రాస్లెట్లను అమ్ముతానని చెప్పినప్పుడు ఈ స్కామ్ జరిగింది. అతని మాటలు నమ్మి, కంపెనీ కొనుగోలును పూర్తి చేసింది. తరువాత నిపుణులకు చూపించగా, సదరు వస్తువులు నకిలీవని, అవి కేవలం Dh35,000 విలువ మాత్రమే ఉంటావని నిర్ధారించారు. ఒక బ్రాస్లెట్లో నకిలీ హాల్మార్క్ ఉందని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. దాని 41 గ్రాముల 18-క్యారెట్ల బంగారం ఆధారంగా, దాని నిజమైన విలువ Dh15,000 మాత్రమే అని అంచనా వేశారు. మిగిలిన రెండు కూడా లగ్జరీ బ్రాండ్లకు ఎటువంటి సంబంధం లేనివని నిర్ధారించారు.
ఫోరెన్సిక్ ప్రయోగశాల నివేదిక ఆధారంగా.. నిందితుడు వాణిజ్య మోసానికి పాల్పడ్డాడని, రిటైలర్ను తప్పుదారి పట్టించాడని, ఆర్థిక నష్టాన్ని కలిగించాడని కోర్టు తీర్పు ఇచ్చింది. స్కామర్ తన బాధితుడికి Dh90,000.. 5 శాతం వడ్డీతో చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







