తెలంగాణ: ఆ రెండు రోజులు వర్షాలు..
- March 16, 2025
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మార్చి 21 నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 21, 22 తేదీల్లో ఆయా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది.
దీంతో ఎండల ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం దొరకనుంది. మరోవైపు, తెలంగాణలో రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపారు.
కొన్ని రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం అయ్యే వరకు ఎండలు మండిపోతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2024 వేసవితో పోల్చితే ఈ సారి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. సాధారణం కంటే 3.3 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది.
ఆదిలాబాద్లో అత్యధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఎండలు, వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం సమయాల్లో అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని అంటున్నారు.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత మరీ అధికంగా ఉంది.రానున్న వారం–పది రోజుల్లో మాత్రం కొద్దిగా భిన్నమైన వాతావరణం ఉండనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి 19 వరకు వేడిగాలులు ఉంటాయని అంటున్నారు.ఆ తర్వాత అకాల వర్షాలు కురిస్తాయని చెబుతున్నారు.
తాజా వార్తలు
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!









