సోషల్ మీడియా యూజర్స్ ను హెచ్చరించిన యూఏఈ..!!
- March 17, 2025
యూఏఈ: సోషల్ మీడియా వినియోగదారులు జాతీయ విలువలను, గౌరవం, సహజీవనం యొక్క సూత్రాలను నిలబెట్టాలని నేషనల్ మీడియా ఆఫీస్ (NMO) స్పష్టం చేసింది. బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రవర్తన ప్రాముఖ్యతను పునరుద్ఘాటించింది. సోషల్ మీడియా వినియోగదారుల చట్టపరమైన, నైతిక బాధ్యతలను వివరించింది. జాతీయ చిహ్నాలు, ప్రజా ప్రముఖులు లేదా స్నేహపూర్వక దేశాలు, వారి సమాజాలను అగౌరవపరిచే కంటెంట్కు వ్యతిరేకంగా హెచ్చరించింది. ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
ప్లాట్ఫారమ్లలో కంటెంట్ను షేర్ చేసేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సోషల్ మీడియా వినియోగదారులను కోరింది. అదే సమయంలో అధికారిక మార్గాల ద్వారా అభ్యంతరకరమైన లేదా సమ్మతి లేని కంటెంట్ను నివేదించాలని సూచించింది. యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి , దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నిర్దేశించిన మార్గదర్శకాలను కూడా ఈ కార్యాలయం హైలైట్ చేసింది. ఇందులో యూఏఈ ఆలోచనలు, సంస్కృతులు, సమాజాలతో సానుకూలంగా ఉండటం వంటివి ఉన్నాయి.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







