సోషల్ మీడియా యూజర్స్ ను హెచ్చరించిన యూఏఈ..!!
- March 17, 2025
యూఏఈ: సోషల్ మీడియా వినియోగదారులు జాతీయ విలువలను, గౌరవం, సహజీవనం యొక్క సూత్రాలను నిలబెట్టాలని నేషనల్ మీడియా ఆఫీస్ (NMO) స్పష్టం చేసింది. బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రవర్తన ప్రాముఖ్యతను పునరుద్ఘాటించింది. సోషల్ మీడియా వినియోగదారుల చట్టపరమైన, నైతిక బాధ్యతలను వివరించింది. జాతీయ చిహ్నాలు, ప్రజా ప్రముఖులు లేదా స్నేహపూర్వక దేశాలు, వారి సమాజాలను అగౌరవపరిచే కంటెంట్కు వ్యతిరేకంగా హెచ్చరించింది. ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
ప్లాట్ఫారమ్లలో కంటెంట్ను షేర్ చేసేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సోషల్ మీడియా వినియోగదారులను కోరింది. అదే సమయంలో అధికారిక మార్గాల ద్వారా అభ్యంతరకరమైన లేదా సమ్మతి లేని కంటెంట్ను నివేదించాలని సూచించింది. యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి , దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నిర్దేశించిన మార్గదర్శకాలను కూడా ఈ కార్యాలయం హైలైట్ చేసింది. ఇందులో యూఏఈ ఆలోచనలు, సంస్కృతులు, సమాజాలతో సానుకూలంగా ఉండటం వంటివి ఉన్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







