సోషల్ మీడియా యూజర్స్ ను హెచ్చరించిన యూఏఈ..!!
- March 17, 2025
యూఏఈ: సోషల్ మీడియా వినియోగదారులు జాతీయ విలువలను, గౌరవం, సహజీవనం యొక్క సూత్రాలను నిలబెట్టాలని నేషనల్ మీడియా ఆఫీస్ (NMO) స్పష్టం చేసింది. బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రవర్తన ప్రాముఖ్యతను పునరుద్ఘాటించింది. సోషల్ మీడియా వినియోగదారుల చట్టపరమైన, నైతిక బాధ్యతలను వివరించింది. జాతీయ చిహ్నాలు, ప్రజా ప్రముఖులు లేదా స్నేహపూర్వక దేశాలు, వారి సమాజాలను అగౌరవపరిచే కంటెంట్కు వ్యతిరేకంగా హెచ్చరించింది. ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
ప్లాట్ఫారమ్లలో కంటెంట్ను షేర్ చేసేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సోషల్ మీడియా వినియోగదారులను కోరింది. అదే సమయంలో అధికారిక మార్గాల ద్వారా అభ్యంతరకరమైన లేదా సమ్మతి లేని కంటెంట్ను నివేదించాలని సూచించింది. యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి , దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నిర్దేశించిన మార్గదర్శకాలను కూడా ఈ కార్యాలయం హైలైట్ చేసింది. ఇందులో యూఏఈ ఆలోచనలు, సంస్కృతులు, సమాజాలతో సానుకూలంగా ఉండటం వంటివి ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









