కేరళలో యూఏఈ కాన్సులేట్
- July 05, 2016
భారతదేశంలో దక్షిణాది రాష్ట్రమైన కేరళలో యూఏఈ త్వరలో కొత్త కాన్సులేట్ని ప్రారంభించనున్నట్లు తెలియవస్తోంది. ఆగస్ట్లో ఈ కాన్సులేట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తిరువనంతపురంలో ఈ కాన్సులేట్ ఏర్పాటు కానుందని సమాచారమ్. అయితే అధికారిక ప్రకటన ఇంకా రావలసి ఉంది. యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ త్వరలోనే ఈ ప్రకటన చేయనుందట. 2011లోనే యూఏఈ, కేరళలో కాన్సులేట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసింది. యూఏఈలో భారతదేశం నుంచి వస్తున్న వలసదారుల్లో కేరళీయులే ఎక్కువ. దాంతో కాన్సులేట్ కేరళలో ఏర్పాటు చేయవలసిందిగా భారతదేశం తరఫున కూడా యూఏఈకి విజ్ఞప్తులు అందాయి. కేరళలో కాన్సులేట్ కార్యాలయం రానుండడాన్ని ఇండియన్ అంబాసిడర్ సీతారామన్ ఆహ్వానిస్తున్నామని చెప్పారు. యూఏఈలో భారతీయ వలసదారుల్లో 50 శాతం మంది కేరళీయులేనని ఆయన తెలిపారు. కాన్సులేట్ ఏర్పాటుతో యూఏఈ - భారత్ మధ్య ప్రయాణాల సంఖ్య ఇంకా పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









