కేరళలో యూఏఈ కాన్సులేట్‌

- July 05, 2016 , by Maagulf
కేరళలో యూఏఈ కాన్సులేట్‌


భారతదేశంలో దక్షిణాది రాష్ట్రమైన కేరళలో యూఏఈ త్వరలో కొత్త కాన్సులేట్‌ని ప్రారంభించనున్నట్లు తెలియవస్తోంది. ఆగస్ట్‌లో ఈ కాన్సులేట్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తిరువనంతపురంలో ఈ కాన్సులేట్‌ ఏర్పాటు కానుందని సమాచారమ్‌. అయితే అధికారిక ప్రకటన ఇంకా రావలసి ఉంది. యూఏఈ మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ త్వరలోనే ఈ ప్రకటన చేయనుందట. 2011లోనే యూఏఈ, కేరళలో కాన్సులేట్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసింది. యూఏఈలో భారతదేశం నుంచి వస్తున్న వలసదారుల్లో కేరళీయులే ఎక్కువ. దాంతో కాన్సులేట్‌ కేరళలో ఏర్పాటు చేయవలసిందిగా భారతదేశం తరఫున కూడా యూఏఈకి విజ్ఞప్తులు అందాయి. కేరళలో కాన్సులేట్‌ కార్యాలయం రానుండడాన్ని ఇండియన్‌ అంబాసిడర్‌ సీతారామన్‌ ఆహ్వానిస్తున్నామని చెప్పారు. యూఏఈలో భారతీయ వలసదారుల్లో 50 శాతం మంది కేరళీయులేనని ఆయన తెలిపారు. కాన్సులేట్‌ ఏర్పాటుతో యూఏఈ - భారత్‌ మధ్య ప్రయాణాల సంఖ్య ఇంకా పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com