భూమి మీదకు వచ్చేస్తున్న సునీతా విలియమ్స్
- March 18, 2025
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరుగు ప్రయాణం కొనసాగుతోంది. ఐఎస్ఎస్ నుంచి స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్లోకి వారిద్దరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు చేరుకున్నారు.ఈ స్పేస్క్రాఫ్ట్ ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఐఎస్ఎస్ నుంచి విడిపోయింది.
అన్డాకింగ్ ప్రక్రియ అనంతరం స్పేస్క్రాఫ్ట్ భూమి దిశగా బయలుదేరింది. బుధవారం తెల్లవారాజుమున భూవాతావరణంలోకి అది ప్రవేశిస్తుంది. ఆ వెంటనే ఇంజిన్ల ప్రజ్వలన చేపడతారు. అనంతరం తెల్లవారాజుమున 3.27 గంటలకు స్పేస్క్రాఫ్ట్ అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లోకి వస్తుంది. వ్యోమగాములను అక్కడి సహాయ బృందాలు బయటకు తీసుకువస్తాయి.
అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమనౌక విడిపోయే ప్రక్రియ ముగియడంతో నాసా ప్రత్యక్ష ప్రసారం ఆపేసింది. ప్రస్తుతం ఆడియో ద్వారా మాత్రమే వివరాలు తెలుపుతోంది. బుధవారం తెల్లవారుజాము 2.15 గంటలకు మళ్లీ లైవ్ ప్రారంభం కావచ్చు.
ఈ ప్రక్రియలు అన్నీ జరిగే వరకు అన్నీ అనుకూలించాల్సి ఉంటుంది. 2024 జూన్ 5న ఐఎస్ఎస్కు వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇన్ని నెలలకు భూమి మీదకు వస్తున్నారు. అంతరిక్ష కేంద్రంలోనే సునీతా విలియమ్స్ దీపావళి, థాంక్స్ గివింగ్ వంటి వేడుకలను జరుపుకున్నారు. డిసెంబర్లో ఐఎస్ఎస్ నుంచే విద్యార్థులతో ఆమె మాట్లాడారు. ఐఎస్ఎస్లో జ్యూస్ ఎలా తాగుతారో కూడా చూపారు.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!









