ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రపంచంలోనే అతిపెద్ద చెక్క రాట్నం
- July 05, 2016
ప్రపంచంలోనే అతిపెద్ద చెక్క రాట్నాన్ని మంగళవారం భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆవిష్కరించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని మూడో నంబర్ టెర్మినల్లో దీన్ని ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్లోని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కెవిఐసీ) బృందం దీన్ని తయారు చేశారు. నాలుగు టన్నుల బరువు ఉండే ఈ రాట్నాన్ని తయారు చేసేందుకు అధిక నాణ్యమైన టేకును ఉపయోగించారు. 26 మంది వడ్రంగులు 40 రోజుల పాటు కష్టపడి దీన్ని రూపొందించారు. ఈ రాట్నం తొమ్మిది మీటర్ల పొడవు ఐదు మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కల్రాజ్ మిశ్రా, మహేశ్ శర్మ, ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. ప్రదర్శనకు ఉంచిన ఈ రాట్నాన్ని సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
తాజా వార్తలు
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!









