50,000 దిర్హామ్లకు పైగా స్వాధీనం..107 మంది బెగ్గర్స్ అరెస్టు..!!
- March 19, 2025
షార్జా: ఈ సంవత్సరం రమదాన్ సందర్భంగా భిక్షాటనపై నిర్వహించిన భారీ దాడిలో షార్జా పోలీసులు 107 మంది వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుండి 50,000 దిర్హామ్లకు పైగా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో 87 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారని అధికార యంత్రాంగం తెలిపింది. 'బెగ్గింగ్ నేరం, దానం ఒక బాధ్యత' అనే శీర్షికతో నిర్వహించిన అవగాహన ప్రచారంలో భాగంగా జరిగిన ఈ ఆపరేషన్, ప్రజల సానుభూతి ఆధారంగా జరిగే దోపిడీని అరికట్టడంతోపాటు నిజమైన అవసరం ఉన్నవారికి విరాళాలను మళ్లించడం లక్ష్యంగా పెట్టుకుందని స్పెషల్ టాస్క్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ ఒమర్ అల్ గజల్ తెలిపారు. ప్రత్యేక హాట్లైన్ నంబర్లు (901) మరియు (80040) ద్వారా బెగ్గర్స్ కు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయాలని కోరారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









