50,000 దిర్హామ్లకు పైగా స్వాధీనం..107 మంది బెగ్గర్స్ అరెస్టు..!!
- March 19, 2025
షార్జా: ఈ సంవత్సరం రమదాన్ సందర్భంగా భిక్షాటనపై నిర్వహించిన భారీ దాడిలో షార్జా పోలీసులు 107 మంది వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుండి 50,000 దిర్హామ్లకు పైగా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో 87 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారని అధికార యంత్రాంగం తెలిపింది. 'బెగ్గింగ్ నేరం, దానం ఒక బాధ్యత' అనే శీర్షికతో నిర్వహించిన అవగాహన ప్రచారంలో భాగంగా జరిగిన ఈ ఆపరేషన్, ప్రజల సానుభూతి ఆధారంగా జరిగే దోపిడీని అరికట్టడంతోపాటు నిజమైన అవసరం ఉన్నవారికి విరాళాలను మళ్లించడం లక్ష్యంగా పెట్టుకుందని స్పెషల్ టాస్క్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ ఒమర్ అల్ గజల్ తెలిపారు. ప్రత్యేక హాట్లైన్ నంబర్లు (901) మరియు (80040) ద్వారా బెగ్గర్స్ కు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయాలని కోరారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









