ఒమన్లో వినియోగదారుల అవగాహనలో గణనీయమైన మెరుగుదల..!!
- March 19, 2025
మస్కట్: 2024 సంవత్సరానికి హక్కులు, బాధ్యతలకు సంబంధించిన వినియోగదారుల సాధికారత సూచిక సుమారు 78%కి చేరుకుంది. ఇది 2022 సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదలను సూచిస్తుందని ఒమన్ వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) తెలిపింది. “ఇది ఒమన్ సుల్తానేట్లో వినియోగదారులు, మార్కెట్ల మధ్య సంబంధంలో సానుకూల అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది. పారదర్శకతను పెంపొందించడానికి.. అదేసమయంలో వినియోగదారుల హక్కులను నిర్ధారించడానికి వినియోగదారుల రక్షణ అథారిటీ చేసిన తీవ్ర ప్రయత్నాల ఫలితంగా ఉంది.” అని పేర్కొన్నారు.
'ఒమన్ సుల్తానేట్లో హక్కులు, విధులపై వినియోగదారుల సాధికారత సూచిక' గురించి అభిప్రాయ సేకరణ ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. దీనిని 2024లో అథారిటీ మార్కెట్ స్టడీస్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ నిర్వహించింది. అధ్యయనంలో ఉపయోగించిన వినియోగదారుల సాధికారత సూచిక మూడు కీలక సూచికలపై ఆధారపడిందన్నారు.మొదటి సూచిక వినియోగదారుల హక్కుల చట్టంపై అవగాహన, ఒప్పంద పరిస్థితులు, వాణిజ్య పద్ధతులకు సంబంధించిన నాలెడ్జ్ స్థాయిని తెలుసుకోవడం, అలాగే మార్పిడి హక్కులతో సహా వినియోగదారుల హక్కులను నిర్ధారించడంపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ విభాగాలను కార్యాచరణ వేగం, నాయకత్వ నాణ్యత, ఉద్యోగ సంతృప్తి, ప్రభుత్వ పని సామర్థ్యాన్ని పెంచడం, మొత్తం పనితీరు ప్రమాణాలను పెంచడం ఆధారంగా అంచనా వేస్తారు. పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ (మదెయిన్) సహకారంతో పారిశ్రామిక ఎస్టేట్లలో 2,800 మంది అభిప్రయాలను సేకరించి, విశ్లేషించారు.
ఈ కార్యక్రమం కార్మిక మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అనేక అధునాతన డిజిటల్ సాధనాలను ప్రారంభించింది. వీటిలో ఆర్థిక రంగాలలో ఉపాధిని నిర్వహించడానికి “తౌతీన్” ప్లాట్ఫామ్, కార్మిక మార్కెట్ డేటాను విశ్లేషించడానికి “మర్సాద్” ప్లాట్ఫామ్, స్థిరమైన కెరీర్ నిర్ణయాలు తీసుకోవడంలో ఒమానీ యువతకు సహాయం చేయడానికి “ఖుటా” ప్లాట్ఫామ్ ఉన్నాయి. 17 కీలక ఆర్థిక రంగాలలో స్థాపించబడిన ఉపాధి పాలన కమిటీలు స్థానికీకరణ లక్ష్యాలను సాధించడానికి, ఒమానీలకు ఉపాధి అవకాశాలను పెంచడానికి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









