ఇఫ్తార్ విందుకు వెళ్తుండగా ప్రమాదం..ముగ్గురు యువకులు మృతి..!!
- March 19, 2025
యూఏఈ: మార్చి 17న సాయంత్రం వాడి అల్ హెలోలో జరిగిన విషాదకరమైన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఎమిరాటీ యువకులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, వాహనం అనేకసార్లు బోల్తా పడి లోయలో పడటంతో మంటలంటుకున్నాయని పోలీసులు తెలిపారు. మృతులంగా 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల వారని పేర్కొన్నారు. ఇఫ్తార్ విందుకు స్నేహితుడి ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని షార్జా పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా రమదాన్ సమయంలో ఇఫ్తార్కు ముందు చాలా మంది తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి వేగంగా వెళతారని, ముఖ్యంగా యువ డ్రైవర్లు రోడ్లపై జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!
- ఖతార్లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం







