గాజా మారణహోమంపై ప్రపంచదేశాలు స్పందించాలి: సౌదీ అరేబియా
- March 19, 2025
జెడ్డా: గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దళాల దురాక్రమణను తిరిగి ప్రారంభించడాన్ని సౌదీ మంత్రుల మండలి ఖండించింది. జెడ్డాలో జరిగిన క్యాబినెట్ సమావేశానికి క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించారు. అనంతరం మీడియా మంత్రి సల్మాన్ అల్-డోసరీ మాట్లాడుతూ.. ఈ నేరాలను ఆపడానికి, పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న మానవతా సంక్షోభాన్ని అంతం చేయడానికి అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని అంతర్జాతీయ సమాజం బాధ్యతను క్యాబినెట్ గుర్తుచేసింది.
సెషన్ ప్రారంభంలోరష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనితో టెలిఫోన్ ద్వారా చర్చల గురించి క్రౌన్ ప్రిన్స్ క్యాబినెట్కు వివరించారు. అరబ్, ప్రాంతీయ, అంతర్జాతీయ రంగాలలో తాజా పరిణామాలను మంత్రివర్గం సమీక్షించింది.
అజర్బైజాన్, అర్మేనియా మధ్య శాంతి చర్చల ముగింపును, అలాగే తజికిస్తాన్ , కిర్గిజ్స్తాన్ మధ్య సరిహద్దు విభజన ఒప్పందంపై సంతకం చేయడాన్ని మంత్రివర్గం స్వాగతించిందని అల్-దోసరీ అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పోర్టులో భారీ పేలుడు.. 400 మందికి పైగా గాయాలు
- TGSRTC : త్వరలో హైదరాబాద్ కి 150 ఎలక్ట్రిక్ బస్సులు
- అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- 17.6 కిలోల మెథాంఫేటమిన్ రవాణాను అడ్డుకున్న జాక్టా..!!
- కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- దహిరాలో థర్డ్ స్కౌట్ క్యాంప్ అల్ ప్రారంభం..!!
- అల్ డైర్ సముద్ర తీరప్రాంతానికి ఫిషింగ్, సిట్టింగ్ ప్లాట్ఫామ్..!!
- ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్కు ఆతిథ్యం..!!
- అమెరికాలో విదేశీ విద్యార్థులు హ్యాపీ
- విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి