గాజా మారణహోమంపై ప్రపంచదేశాలు స్పందించాలి: సౌదీ అరేబియా
- March 19, 2025
జెడ్డా: గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దళాల దురాక్రమణను తిరిగి ప్రారంభించడాన్ని సౌదీ మంత్రుల మండలి ఖండించింది. జెడ్డాలో జరిగిన క్యాబినెట్ సమావేశానికి క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించారు. అనంతరం మీడియా మంత్రి సల్మాన్ అల్-డోసరీ మాట్లాడుతూ.. ఈ నేరాలను ఆపడానికి, పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న మానవతా సంక్షోభాన్ని అంతం చేయడానికి అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని అంతర్జాతీయ సమాజం బాధ్యతను క్యాబినెట్ గుర్తుచేసింది.
సెషన్ ప్రారంభంలోరష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనితో టెలిఫోన్ ద్వారా చర్చల గురించి క్రౌన్ ప్రిన్స్ క్యాబినెట్కు వివరించారు. అరబ్, ప్రాంతీయ, అంతర్జాతీయ రంగాలలో తాజా పరిణామాలను మంత్రివర్గం సమీక్షించింది.
అజర్బైజాన్, అర్మేనియా మధ్య శాంతి చర్చల ముగింపును, అలాగే తజికిస్తాన్ , కిర్గిజ్స్తాన్ మధ్య సరిహద్దు విభజన ఒప్పందంపై సంతకం చేయడాన్ని మంత్రివర్గం స్వాగతించిందని అల్-దోసరీ అన్నారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







