గాజా మారణహోమంపై ప్రపంచదేశాలు స్పందించాలి: సౌదీ అరేబియా
- March 19, 2025
జెడ్డా: గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దళాల దురాక్రమణను తిరిగి ప్రారంభించడాన్ని సౌదీ మంత్రుల మండలి ఖండించింది. జెడ్డాలో జరిగిన క్యాబినెట్ సమావేశానికి క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించారు. అనంతరం మీడియా మంత్రి సల్మాన్ అల్-డోసరీ మాట్లాడుతూ.. ఈ నేరాలను ఆపడానికి, పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న మానవతా సంక్షోభాన్ని అంతం చేయడానికి అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని అంతర్జాతీయ సమాజం బాధ్యతను క్యాబినెట్ గుర్తుచేసింది.
సెషన్ ప్రారంభంలోరష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనితో టెలిఫోన్ ద్వారా చర్చల గురించి క్రౌన్ ప్రిన్స్ క్యాబినెట్కు వివరించారు. అరబ్, ప్రాంతీయ, అంతర్జాతీయ రంగాలలో తాజా పరిణామాలను మంత్రివర్గం సమీక్షించింది.
అజర్బైజాన్, అర్మేనియా మధ్య శాంతి చర్చల ముగింపును, అలాగే తజికిస్తాన్ , కిర్గిజ్స్తాన్ మధ్య సరిహద్దు విభజన ఒప్పందంపై సంతకం చేయడాన్ని మంత్రివర్గం స్వాగతించిందని అల్-దోసరీ అన్నారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







