గాజా మారణహోమంపై ప్రపంచదేశాలు స్పందించాలి: సౌదీ అరేబియా
- March 19, 2025
జెడ్డా: గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దళాల దురాక్రమణను తిరిగి ప్రారంభించడాన్ని సౌదీ మంత్రుల మండలి ఖండించింది. జెడ్డాలో జరిగిన క్యాబినెట్ సమావేశానికి క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించారు. అనంతరం మీడియా మంత్రి సల్మాన్ అల్-డోసరీ మాట్లాడుతూ.. ఈ నేరాలను ఆపడానికి, పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న మానవతా సంక్షోభాన్ని అంతం చేయడానికి అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని అంతర్జాతీయ సమాజం బాధ్యతను క్యాబినెట్ గుర్తుచేసింది.
సెషన్ ప్రారంభంలోరష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనితో టెలిఫోన్ ద్వారా చర్చల గురించి క్రౌన్ ప్రిన్స్ క్యాబినెట్కు వివరించారు. అరబ్, ప్రాంతీయ, అంతర్జాతీయ రంగాలలో తాజా పరిణామాలను మంత్రివర్గం సమీక్షించింది.
అజర్బైజాన్, అర్మేనియా మధ్య శాంతి చర్చల ముగింపును, అలాగే తజికిస్తాన్ , కిర్గిజ్స్తాన్ మధ్య సరిహద్దు విభజన ఒప్పందంపై సంతకం చేయడాన్ని మంత్రివర్గం స్వాగతించిందని అల్-దోసరీ అన్నారు.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









