షార్జాలో వాటర్ ట్యాంక్లో పడి 28 ఏళ్ల కార్మికుడు మృతి..!!
- March 22, 2025
యూఏఈ: షార్జా అల్ మడమ్ ప్రాంతంలోని ఒక పొలంలో ఉన్న వాటర్ ట్యాంక్లో పడి పడి 28 ఏళ్ల ఆఫ్రికన్ కార్మికుడి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అధికారుల కథనం ప్రకారం.. ఒక సహోద్యోగి బాధితుడిని గుర్తించిన వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చాడు. షార్జా పోలీసు ఫోరెన్సిక్ ప్రయోగశాల, క్రైమ్ సీన్ యూనిట్, పెట్రోలింగ్ అధికారులతో కూడిన బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడ వారు నీటిలో పడిఉన్న మృతదేహాన్ని కనుగొన్నారు. మరణానికి సంబంధించిన పరిస్థితులను నిర్ధారించడానికి సంఘటన స్థలం నుండి ఆధారాలు, వేలిముద్రలను సేకరించి, బాధితుడి సహచరులను ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
ప్రాథమిక దర్యాప్తులో ఆ వ్యక్తిని గుర్తించడానికి కొన్ని గంటల ముందు మరణించాడని, అతని శరీరం ఇప్పటికే కుళ్ళిపోవడం ప్రారంభించిందని తేలింది. వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించిన తర్వాత మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి మృతదేహాన్ని షార్జా పోలీసు ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు.
తాజా వార్తలు
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు







