షార్జాలో వాటర్ ట్యాంక్లో పడి 28 ఏళ్ల కార్మికుడు మృతి..!!
- March 22, 2025
యూఏఈ: షార్జా అల్ మడమ్ ప్రాంతంలోని ఒక పొలంలో ఉన్న వాటర్ ట్యాంక్లో పడి పడి 28 ఏళ్ల ఆఫ్రికన్ కార్మికుడి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అధికారుల కథనం ప్రకారం.. ఒక సహోద్యోగి బాధితుడిని గుర్తించిన వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చాడు. షార్జా పోలీసు ఫోరెన్సిక్ ప్రయోగశాల, క్రైమ్ సీన్ యూనిట్, పెట్రోలింగ్ అధికారులతో కూడిన బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడ వారు నీటిలో పడిఉన్న మృతదేహాన్ని కనుగొన్నారు. మరణానికి సంబంధించిన పరిస్థితులను నిర్ధారించడానికి సంఘటన స్థలం నుండి ఆధారాలు, వేలిముద్రలను సేకరించి, బాధితుడి సహచరులను ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
ప్రాథమిక దర్యాప్తులో ఆ వ్యక్తిని గుర్తించడానికి కొన్ని గంటల ముందు మరణించాడని, అతని శరీరం ఇప్పటికే కుళ్ళిపోవడం ప్రారంభించిందని తేలింది. వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించిన తర్వాత మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి మృతదేహాన్ని షార్జా పోలీసు ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









