అత్యవసరంగా ల్యాండైన సౌదీ వెళ్లాల్సిన విమానం..
- July 05, 2016
ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో సౌదీ అరేబియా వెళ్లాల్సిన విమానం అత్యవసరంగా ల్యాండైంది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రయాణికుడు విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత అస్వస్థతకు గురికావడంతో ఏటీసీ అనుమతితో వెంటనే విమానాన్ని ల్యాండింగ్ చేశారు. విమానాశ్రయంలోని అపోలో అస్పత్రిలో చికిత్స పొందిన ప్రయాణికుడు మంగళవారం సాయంత్ర డిశ్చార్జి అయినట్లు సమాచారం. ఆలస్యంగా బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆలస్యంగా బయలుదేరింది. మరమ్మతుల అనంతరం రాత్రి 8.30 గంటలకు విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకుంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







