ఏప్రిల్ నుండి 10% వరకు పెరుగనున్న వీసా ఖర్చులు..!!
- March 24, 2025
యూఏఈ: యునైటెడ్ కింగ్డమ్కు ప్రయాణించే యూఏఈ నివాసితులు వచ్చే నెల నుండి అధిక వీసా ఖర్చులను చెల్లించాల్సి ఉంటుంది. వివిధ వర్గాలకు వీసాల రుసుములు దాదాపు 10 శాతం పెరిగాయి. ఏప్రిల్ 9 నుండి 6 నెలల వరకు విజిట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు రుసుము £115తో పోలిస్తే £127 చెల్లించాల్సి ఉంటుంది.
అదేవిధంగా, రెండు సంవత్సరాల వరకు విజిట్ వీసా ధర £43 పెరిగి £475కి చేరుకుంది. ఐదు సంవత్సరాల వరకు వీసా ధర £77 పెరిగి £848 కు చేరుకుంటుంది. 10 సంవత్సరాల వరకు వీసా ధర £96 పెరిగి £1,059 కు చేరింది. అయితే, యూకేకి ప్రయాణించే ఎమిరాటీలు ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ETA ప్రస్తుతం £10 ఖర్చవుతుంది. రెండు సంవత్సరాలలో ఆరు నెలల వరకు లేదా హోల్డర్ పాస్పోర్ట్ గడువు ముగిసే వరకు ఒకేసారియూకేకి పలుసార్లు అనుమతిస్తుంది. ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో పెద్ద సంఖ్యలో యూఏఈ పౌరులు, ప్రవాస నివాసితులు యూరోపియన్ దేశానికి ప్రయాణిస్తుంటారు.
షెంగెన్ దేశాల కంటే వీసా దరఖాస్తు స్లాట్లను సులభంగా యాక్సెస్ చేయడం వలన ఎక్కువ మంది యూకే వైపు ఆకర్షితులవుతున్నారని డీరా ట్రావెల్ జనరల్ మేనేజర్ సుధీష్ తెలిపారు.వైస్ఫాక్స్ టూరిజం సీనియర్ మేనేజర్ సుబైర్ థెకేపురథ్వలప్పిల్ మాట్లాడుతూ.. సింగిల్ ఎంట్రీ వీసాలు ఇచ్చే ఇతర యూరోపియన్ దేశాల మాదిరిగా కాకుండా, ఆరు నెలల వీసాల నుండి మల్టీ ఎంట్రీలను ఇవ్వడం వలన అనేకమంది యూకేలో పర్యటించేందుకు ఇష్టపడతారని అన్నారు. పైగా యూకే వీసా కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







