జగన్నాథ యాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభం
- July 06, 2016
ప్రపంచ ప్రఖ్యాత రథయాత్రగా పేరొందిన పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢ శుక్ల విదియ బుధవారం నాడు అట్టహాసంగా ప్రారంభమైన రథయాత్ర 9 రోజులపాటు కొనసాగుతుంది. భక్తజన వల్లభుడు పూరీ జగన్నాధుడు దేశ ప్రజలందరినీ చల్లాగా చూసి కాపాడాలని ప్రధాని ఈ సందర్భంగా కోరుతూ ట్వీట్ చేశారు.పూరీ జగన్నాథ యాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రథయాత్ర నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుని ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. జగన్నాథుని ఆశీస్సులతో గ్రామాలు అభివృద్ధి చెందాలని, పేద ప్రజలు, రైతులు మంచి ఫలితాలను సాధించి భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగగలదని ఆకాంక్షిస్తున్నట్లు మోదీ తన ట్వీట్లో తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో ఆలయ ప్రాంతం కిక్కిరిసింది. జగన్నాథుని భారీ రథయాత్రకు లక్షలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం పూరీ ప్రాంతంలో భద్రతా చర్యలను పటిష్టం చేసింది. బుధవారం ఉదయం 4 గంటలకు మంగళహారతి అనంతరం గోపాల వల్లభ సేవతో పూరీ శ్రీ క్షేత్రంలో జగన్నాథుని రథయాత్రను ప్రారంభించారు. రథయాత్ర జరిగే ప్రాంతమైన బొడోదండో జగన్నాథస్వామి నామస్మరణతో మారుమోగుతోంది.
తాజా వార్తలు
- కొత్తగా ప్రపోజ్ చేస్తానని పిలిచి.. బెంగుళూరులో ఘోరం
- టాలీవుడ్లో విషాదం..చిట్టిబాబు కన్నుమూత
- వైభవంగా కేదార్నాథ్ ఆలయ పునఃప్రారంభం..
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!









