మయన్మార్ భూకంపం.. తమ జాతీయులు భద్రతపై ఒమన్ ప్రకటన..!!
- March 29, 2025
మస్కట్: మయన్మార్ లో భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలో బ్యాంకాక్లోని ఒమన్ సుల్తానేట్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్తో సహా వివిధ ప్రాంతాలలో భూకంపం ప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది. కాగా, భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రాయబార కార్యాలయం ధృవీకరించింది. థాయిలాండ్లోని ఒమన్ పౌరులందరూ ప్రశాంతంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని, స్థానిక థాయ్ అధికారులు జారీ చేసిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని కోరింది.
అత్యవసర పరిస్థితుల కోసం, రాయబార కార్యాలయం 24/7 అందుబాటులో ఉన్న ప్రత్యేక హాట్లైన్ నంబర్ +66638871775ను సంప్రదించాలని సూచించింది. అవసరమైన వారికి ఏ విధంగానైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని ఒమన్ జాతీయులకు హామీ ఇచ్చింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







