మయన్మార్ భూకంపం.. తమ జాతీయులు భద్రతపై ఒమన్ ప్రకటన..!!
- March 29, 2025
మస్కట్: మయన్మార్ లో భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలో బ్యాంకాక్లోని ఒమన్ సుల్తానేట్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్తో సహా వివిధ ప్రాంతాలలో భూకంపం ప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది. కాగా, భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రాయబార కార్యాలయం ధృవీకరించింది. థాయిలాండ్లోని ఒమన్ పౌరులందరూ ప్రశాంతంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని, స్థానిక థాయ్ అధికారులు జారీ చేసిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని కోరింది.
అత్యవసర పరిస్థితుల కోసం, రాయబార కార్యాలయం 24/7 అందుబాటులో ఉన్న ప్రత్యేక హాట్లైన్ నంబర్ +66638871775ను సంప్రదించాలని సూచించింది. అవసరమైన వారికి ఏ విధంగానైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని ఒమన్ జాతీయులకు హామీ ఇచ్చింది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







