అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- March 13, 2026
అమరావతి: అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BITS) పిలాని ఏఐ ప్లస్ క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. బిట్స్ ప్రతినిధులు సిద్ధార్థ బెనర్జీ, ఎన్.చెన్నవీర్, బీఎస్ సహాని శుక్రవారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ను కలిసి బిట్స్ ఏఐ క్యాంపస్ ప్లాన్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బిట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ... ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులు అమరావతి క్యాంపస్ లో ఉంటాయని తెలిపారు. “రెండు దశల్లో 7వేలమంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా అమరావతి బిట్స్ పిలాని నిర్మాణాలను చేపడుతున్నాం, ఈ క్యాంపస్ పై వచ్చే ఐదేళ్లలో వెయ్యికోట్ల పెట్టుబడి పెడతాం” అని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దార్శనికతకు అనుగుణంగా నెక్ట్స్ జెన్ టెక్నాలజీలతో ఈ క్యాంపస్ నిర్మిస్తున్నాం. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణంలో గ్రీన్ బిల్డింగ్, రెన్యువబుల్ ఎనర్జీ వంటి పర్యావరణహిత విధానాలను పాటిస్తున్నాం. అమరావతి బిట్స్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ గా ఉండబోతోంది.అధునాతన సాంకేతికలతో పాటు వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వంటి కోర్సులు కూడా ఇక్కడ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు బిట్స్ ప్రతినిధులు తెలిపారు.బిట్స్ నిర్మాణ ప్లాన్లను పరిశీలించిన మంత్రి లోకేష్ సంతృప్తి వ్యక్తంచేశారు. సాధ్యమైనంత త్వరగా అమరావతి క్యాంపస్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్







