అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- March 13, 2026
న్యూఢిల్లీ: భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి మరియు ‘అటల్ స్మృతి న్యాస్ సొసైటీ’ అధ్యక్షులు ముప్పవరపు వెంకయ్య నాయుడు ఢిల్లీలోని 1, త్యాగరాజ్ మార్గ్ లో ఉన్న తమ అధికారిక నివాసంలో...అటల్ స్మృతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురు ప్రముఖులతో వరుస చర్చలు జరుపుతున్నారు. బుధవారం నాడు పలువురు రాజకీయ, అటల్ జీ తో పని చేసిన ప్రముఖులతో సమావేశమైన ఆయన...ఈరోజు అనగా గురువారం నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖాగుప్త, మాజీ కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్, పూర్వ ప్రధాన మంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా, హర్యానా పూర్వ మంత్రి ఓం ప్రకాష్ ధన్ కర్ తో సమావేశమయ్యారు.
భారతదేశ గౌరవ పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ జీవితం, వారు పాటించిన విలువలు మరియు దేశానికి వారు అందించిన అసమానమైన సేవలను గౌరవించుకోవడంతో పాటు, వారి వారసత్వాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ భేటీలు సాగుతున్నాయి. అటల్ జీ ఆశయాలకు అనుగుణంగా అటల్ స్మతిన్యాస్ సొసైటీ ద్వారా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించడమే ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. స్మృతిన్యాస్ సొసైటీ చేపట్టబోయే కార్యక్రమాలకు తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని ఈ సమావేశాల్లో పాల్గొన్న ప్రముఖులు తెలియజేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









