అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- March 13, 2026
న్యూఢిల్లీ: భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి మరియు ‘అటల్ స్మృతి న్యాస్ సొసైటీ’ అధ్యక్షులు ముప్పవరపు వెంకయ్య నాయుడు ఢిల్లీలోని 1, త్యాగరాజ్ మార్గ్ లో ఉన్న తమ అధికారిక నివాసంలో...అటల్ స్మృతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురు ప్రముఖులతో వరుస చర్చలు జరుపుతున్నారు. బుధవారం నాడు పలువురు రాజకీయ, అటల్ జీ తో పని చేసిన ప్రముఖులతో సమావేశమైన ఆయన...ఈరోజు అనగా గురువారం నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖాగుప్త, మాజీ కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్, పూర్వ ప్రధాన మంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా, హర్యానా పూర్వ మంత్రి ఓం ప్రకాష్ ధన్ కర్ తో సమావేశమయ్యారు.
భారతదేశ గౌరవ పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ జీవితం, వారు పాటించిన విలువలు మరియు దేశానికి వారు అందించిన అసమానమైన సేవలను గౌరవించుకోవడంతో పాటు, వారి వారసత్వాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ భేటీలు సాగుతున్నాయి. అటల్ జీ ఆశయాలకు అనుగుణంగా అటల్ స్మతిన్యాస్ సొసైటీ ద్వారా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించడమే ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. స్మృతిన్యాస్ సొసైటీ చేపట్టబోయే కార్యక్రమాలకు తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని ఈ సమావేశాల్లో పాల్గొన్న ప్రముఖులు తెలియజేశారు.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









