అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- March 13, 2026
న్యూఢిల్లీ: భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి మరియు ‘అటల్ స్మృతి న్యాస్ సొసైటీ’ అధ్యక్షులు ముప్పవరపు వెంకయ్య నాయుడు ఢిల్లీలోని 1, త్యాగరాజ్ మార్గ్ లో ఉన్న తమ అధికారిక నివాసంలో...అటల్ స్మృతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురు ప్రముఖులతో వరుస చర్చలు జరుపుతున్నారు. బుధవారం నాడు పలువురు రాజకీయ, అటల్ జీ తో పని చేసిన ప్రముఖులతో సమావేశమైన ఆయన...ఈరోజు అనగా గురువారం నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖాగుప్త, మాజీ కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్, పూర్వ ప్రధాన మంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా, హర్యానా పూర్వ మంత్రి ఓం ప్రకాష్ ధన్ కర్ తో సమావేశమయ్యారు.
భారతదేశ గౌరవ పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ జీవితం, వారు పాటించిన విలువలు మరియు దేశానికి వారు అందించిన అసమానమైన సేవలను గౌరవించుకోవడంతో పాటు, వారి వారసత్వాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ భేటీలు సాగుతున్నాయి. అటల్ జీ ఆశయాలకు అనుగుణంగా అటల్ స్మతిన్యాస్ సొసైటీ ద్వారా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించడమే ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. స్మృతిన్యాస్ సొసైటీ చేపట్టబోయే కార్యక్రమాలకు తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని ఈ సమావేశాల్లో పాల్గొన్న ప్రముఖులు తెలియజేశారు.
తాజా వార్తలు
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్







