అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- March 13, 2026
పశ్చిమ ఇరాక్ ప్రాంతంలో అమెరికాకు చెందిన KC-135 స్ట్రాటో ట్యాంకర్ కూలిన ఘటనపై యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టతనిచ్చింది.ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న ఆరుగురు సిబ్బందిలో నలుగురు మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రమాదం జరిగిన వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. మిగిలిన ఇద్దరు సిబ్బంది పరిస్థితిపై ఇంకా స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది.సైనిక నిబంధనల ప్రకారం, మరణించిన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన 24 గంటల తర్వాతే వారి పేర్లను బహిరంగపరుస్తామని అధికారులు తెలిపారు.
సాధారణ రీఫ్యుయలింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. KC-135 విమానం మరో యుద్ధ విమానానికి ఇంధనాన్ని నింపుతున్న సమయంలో నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. అయితే, ఇంధనాన్ని తీసుకుంటున్న మరో విమానం ఎటువంటి నష్టం లేకుండా సురక్షితంగా సమీపంలోని బేస్ లో ల్యాండ్ అయింది. ఈ విమానం కూలడం వెనుక ఎలాంటి శత్రు దేశాల దాడులు లేదా ‘ఫ్రెండ్లీ ఫైర్’ (సొంత దళాల పొరపాటు కాల్పులు) లేవని సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ప్రాథమిక అంచనా ప్రకారం ఇది సాంకేతిక లోపం లేదా వాతావరణ పరిస్థితుల వల్ల జరిగిన ప్రమాదం గానే భావిస్తున్నారు. ప్రస్తుతం బ్లాక్ బాక్స్ కోసం మరియు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను విశ్లేషించేందుకు దర్యాప్తు బృందం పనిచేస్తోంది.
తాజా వార్తలు
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!
- పిల్లలలో అవాంఛిత ప్రవర్తన నివారణకు క్లోజ్ మానిటరింగ్..!!
- ఒమన్ లో ఒక్క రోజులోనే భారతీయ పాస్ పోర్ట్ ప్రక్రియ పూర్తి..!!
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన









