అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- March 13, 2026
పశ్చిమ ఇరాక్ ప్రాంతంలో అమెరికాకు చెందిన KC-135 స్ట్రాటో ట్యాంకర్ కూలిన ఘటనపై యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టతనిచ్చింది.ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న ఆరుగురు సిబ్బందిలో నలుగురు మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రమాదం జరిగిన వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. మిగిలిన ఇద్దరు సిబ్బంది పరిస్థితిపై ఇంకా స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది.సైనిక నిబంధనల ప్రకారం, మరణించిన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన 24 గంటల తర్వాతే వారి పేర్లను బహిరంగపరుస్తామని అధికారులు తెలిపారు.
సాధారణ రీఫ్యుయలింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. KC-135 విమానం మరో యుద్ధ విమానానికి ఇంధనాన్ని నింపుతున్న సమయంలో నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. అయితే, ఇంధనాన్ని తీసుకుంటున్న మరో విమానం ఎటువంటి నష్టం లేకుండా సురక్షితంగా సమీపంలోని బేస్ లో ల్యాండ్ అయింది. ఈ విమానం కూలడం వెనుక ఎలాంటి శత్రు దేశాల దాడులు లేదా ‘ఫ్రెండ్లీ ఫైర్’ (సొంత దళాల పొరపాటు కాల్పులు) లేవని సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ప్రాథమిక అంచనా ప్రకారం ఇది సాంకేతిక లోపం లేదా వాతావరణ పరిస్థితుల వల్ల జరిగిన ప్రమాదం గానే భావిస్తున్నారు. ప్రస్తుతం బ్లాక్ బాక్స్ కోసం మరియు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను విశ్లేషించేందుకు దర్యాప్తు బృందం పనిచేస్తోంది.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









