మయన్మార్ భూకంపం.. తమ జాతీయులు భద్రతపై ఒమన్ ప్రకటన..!!

- March 29, 2025 , by Maagulf
మయన్మార్ భూకంపం.. తమ జాతీయులు భద్రతపై ఒమన్ ప్రకటన..!!

మస్కట్: మయన్మార్‌ లో భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలో బ్యాంకాక్‌లోని ఒమన్ సుల్తానేట్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌తో సహా వివిధ ప్రాంతాలలో భూకంపం ప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది. కాగా, భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రాయబార కార్యాలయం ధృవీకరించింది. థాయిలాండ్‌లోని ఒమన్ పౌరులందరూ ప్రశాంతంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని, స్థానిక థాయ్ అధికారులు జారీ చేసిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని కోరింది.
అత్యవసర పరిస్థితుల కోసం, రాయబార కార్యాలయం 24/7 అందుబాటులో ఉన్న ప్రత్యేక హాట్‌లైన్ నంబర్ +66638871775ను సంప్రదించాలని సూచించింది.  అవసరమైన వారికి ఏ విధంగానైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని ఒమన్ జాతీయులకు హామీ ఇచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com