ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు..శుభాకాంక్షలు పంచుకున్న యూఏఈ నేతలు..!!
- March 31, 2025
యూఏఈః యూఏఈలో ఈద్ అల్ ఫితర్ వేడుకలు ఘనంగా జరిగాయి. మార్చి 30న తెల్లవారుజామున ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు చేయడానికి ముఖ్యమైన నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాధినేతలు యూఏఈ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ప్రార్థనల అనంతరం దేశంలో నివసిస్తున్న ప్రజలకు, ఎమిరేట్స్, ఇస్లామిక్ దేశాల అధినేతలకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అబుదాబిలోని షేక్ జాయెద్ మసీదులో యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు చేశారు. ఆ నాయకుడు మసీదులోకి ప్రవేశించి, ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాన మంత్రి మరియు ప్రెసిడెన్షియల్ కోర్ట్ చైర్మన్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దుబాయ్లో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్రాండ్ జబీల్ మసీదులో ఈద్ ప్రార్థనలు చేశారు.
షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి..సుప్రీం కౌన్సిల్ సభ్యుడు మరియు షార్జా పాలకుడు, ఎమిరేట్లోని అల్ బాడి ప్రార్థన హాలులో ఈద్ ప్రార్థనలు చేశారు.
అజ్మాన్ పాలకుడు షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నుయిమి ఎమిరేట్లోని అల్ జహెర్ ప్యాలెస్ మసీదులో ఈద్ ప్రార్థనలు చేశారు.
ఉమ్ అల్ క్వైన్ పాలకుడు షేక్ సౌద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా మసీదులో ఈద్ ప్రార్థనలలో పాల్గొన్నారు.
రస్ అల్ ఖైమా పాలకుడు షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ ఖాసిమి ఖాజమ్లోని గ్రాండ్ ఈద్ ప్రార్థన మైదానంలో ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలలో పాల్గొన్నారు.
ఫుజైరా పాలకుడు షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ షార్కి నగరంలోని షేక్ జాయెద్ మసీదులో ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







