ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు..శుభాకాంక్షలు పంచుకున్న యూఏఈ నేతలు..!!
- March 31, 2025
యూఏఈః యూఏఈలో ఈద్ అల్ ఫితర్ వేడుకలు ఘనంగా జరిగాయి. మార్చి 30న తెల్లవారుజామున ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు చేయడానికి ముఖ్యమైన నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాధినేతలు యూఏఈ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ప్రార్థనల అనంతరం దేశంలో నివసిస్తున్న ప్రజలకు, ఎమిరేట్స్, ఇస్లామిక్ దేశాల అధినేతలకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అబుదాబిలోని షేక్ జాయెద్ మసీదులో యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు చేశారు. ఆ నాయకుడు మసీదులోకి ప్రవేశించి, ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాన మంత్రి మరియు ప్రెసిడెన్షియల్ కోర్ట్ చైర్మన్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దుబాయ్లో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్రాండ్ జబీల్ మసీదులో ఈద్ ప్రార్థనలు చేశారు.
షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి..సుప్రీం కౌన్సిల్ సభ్యుడు మరియు షార్జా పాలకుడు, ఎమిరేట్లోని అల్ బాడి ప్రార్థన హాలులో ఈద్ ప్రార్థనలు చేశారు.
అజ్మాన్ పాలకుడు షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నుయిమి ఎమిరేట్లోని అల్ జహెర్ ప్యాలెస్ మసీదులో ఈద్ ప్రార్థనలు చేశారు.
ఉమ్ అల్ క్వైన్ పాలకుడు షేక్ సౌద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా మసీదులో ఈద్ ప్రార్థనలలో పాల్గొన్నారు.
రస్ అల్ ఖైమా పాలకుడు షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ ఖాసిమి ఖాజమ్లోని గ్రాండ్ ఈద్ ప్రార్థన మైదానంలో ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలలో పాల్గొన్నారు.
ఫుజైరా పాలకుడు షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ షార్కి నగరంలోని షేక్ జాయెద్ మసీదులో ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!