గ్యాస్ పైప్‌లైన్ పేలుడు..100 మందికి పైగా గాయాలు..!!

- April 02, 2025 , by Maagulf
గ్యాస్ పైప్‌లైన్ పేలుడు..100 మందికి పైగా గాయాలు..!!

కౌలాలంపూర్ [మలేషియా] : మయన్మార్ రాజధాని కౌలాలంపూర్ శివార్లలో గ్యాస్ పైప్‌లైన్ లీక్ కావడంతో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా గాయపడ్డారు.  మలేషియా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇంధన సంస్థ పెట్రోనాస్‌కు చెందిన గ్యాస్ పైప్‌లైన్, సెంట్రల్ సెలంగూర్ రాష్ట్రంలోని పుత్రా హైట్స్ శివారులో ఉదయం 8:10 గంటలకు (స్థానిక సమయం) అగ్నిప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి.

ఈద్ వేడుకల కారణంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయని స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రమాదంలో 112 మంది వరకు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించినట్లు సెలంగోర్ డిప్యూటీ పోలీస్ చీఫ్ మొహమ్మద్ జైని అబు హసన్ తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com