స్విగ్గీకి రూ.158 కోట్ల జీఎస్టీ నోటీసులు
- April 02, 2025
న్యూ ఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ నుంచి ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీకి నోటీసులు అందాయి. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుకు సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ ఈ నోటీసులు వచ్చాయి.ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్ఛేంజీ ఫైలింగ్లో పేర్కొంది. మొత్తం రూ.158.25 కోట్ల పన్ను చెల్లించాలని ఆదేశాలు వచ్చినట్లు పేర్కొంది.
తమకు నోటీసులు అందాయంటూ స్విగ్గీ
2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి మధ్యకాలంలో డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ బకాయిలు రూ.158.27 కోట్లుగా పేర్కొంటూ తమకు నోటీసులు అందాయంటూ స్విగ్గీ పేర్కొంది. అయితే దీనిపై తాము సంబంధిత అధికారుల ముందు అప్పీల్ చేయనున్నట్లు తెలిపింది. ఆదాయపన్ను శాఖ నుంచి వచ్చిన ఆదేశాలు తమ ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపవని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్విగ్గీ షేర్లు రాణిస్తున్నాయి. 10:40 గంటల సమయంలో షేర్లు 2.80 శాతం లాభంతో రూ.340.85 వద్ద ట్రేడవుతున్నాయి. కాగా, స్విగ్గీకి గతంలోనూ ఇలాంటి జీఎస్టీ బకాయిలకు సంబంధించిన నోటీసులు జారీ అయిన విషయం గమనార్హం.
తాజా వార్తలు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!







