అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- January 24, 2026
అమెరికా: అమెరికాలోని జార్జియాలో కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ కేసులో అనుమానితుడైన విజయ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపింది.
మృతులను మీము డోగ్రా(43), గౌరవ్ కుమార్(33), నిధి చందర్(37), హరీశ్ చందర్(38)గా గుర్తించారు. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఘటన జరిగిన సమయంలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని, వారు ఒక గదిలో దాక్కున్నారని తెలిపింది. వాళ్లలో ఒకరు పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించారని చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లే సరికి నలుగు మృతదేహాలు కనిపించాయని చెప్పారు. పిల్లలు మాత్రం సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించాయి.
ఈ ఘటన పై అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని కూడా కాన్సులేట్ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని జార్జియా పోలీసులు వెల్లడించారు. కాల్పులకు దారి తీసిన పరిస్థితులు, కుటుంబ కలహాల నేపథ్యం, అనుమానితుడి ఉద్దేశాలు వంటి అంశాలపై లోతుగా విచారణ కొనసాగుతోందని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







