అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- January 24, 2026
అమెరికా: అమెరికాలోని జార్జియాలో కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ కేసులో అనుమానితుడైన విజయ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపింది.
మృతులను మీము డోగ్రా(43), గౌరవ్ కుమార్(33), నిధి చందర్(37), హరీశ్ చందర్(38)గా గుర్తించారు. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఘటన జరిగిన సమయంలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని, వారు ఒక గదిలో దాక్కున్నారని తెలిపింది. వాళ్లలో ఒకరు పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించారని చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లే సరికి నలుగు మృతదేహాలు కనిపించాయని చెప్పారు. పిల్లలు మాత్రం సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించాయి.
ఈ ఘటన పై అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని కూడా కాన్సులేట్ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని జార్జియా పోలీసులు వెల్లడించారు. కాల్పులకు దారి తీసిన పరిస్థితులు, కుటుంబ కలహాల నేపథ్యం, అనుమానితుడి ఉద్దేశాలు వంటి అంశాలపై లోతుగా విచారణ కొనసాగుతోందని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







