షార్జాలోని 9 మందిని రక్షించిన సిబ్బందిని సత్కరించిన ఉప ప్రధాన మంత్రి..!!
- April 08, 2025
యూఏఈ: సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిది మంది ఆసియన్ల ప్రాణాలను కాపాడిన సెర్చ్-అండ్-రెస్క్యూ ఆపరేషన్ కోసం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సభ్యులను యూఏఈ ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సత్కరించారు. పైలట్లు, నావిగేటర్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సహా వైమానిక దళ సభ్యులకు షేక్ సైఫ్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ పతకాలను అందజేశారు.
షార్జాలోని హమ్రియా ఓడరేవు సమీపంలో వారి ఓడ బోల్తా పడిన తర్వాత, రెండు గంటల పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్లో తొమ్మిది మందిని ఎటువంటి గాయాలు లేకుండా రక్షించారు.అధికారుల నుండి సంఘటన గురించి నివేదికలు అందిన తర్వాత, మంత్రిత్వ శాఖ ఎయిర్ వింగ్ మెడికల్, వైమానిక సిబ్బంది వేగంగా స్పందించి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి వారిని రక్షించారు.
తాజా వార్తలు
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు







