షార్జాలోని 9 మందిని రక్షించిన సిబ్బందిని సత్కరించిన ఉప ప్రధాన మంత్రి..!!
- April 08, 2025
యూఏఈ: సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిది మంది ఆసియన్ల ప్రాణాలను కాపాడిన సెర్చ్-అండ్-రెస్క్యూ ఆపరేషన్ కోసం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సభ్యులను యూఏఈ ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సత్కరించారు. పైలట్లు, నావిగేటర్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సహా వైమానిక దళ సభ్యులకు షేక్ సైఫ్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ పతకాలను అందజేశారు.
షార్జాలోని హమ్రియా ఓడరేవు సమీపంలో వారి ఓడ బోల్తా పడిన తర్వాత, రెండు గంటల పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్లో తొమ్మిది మందిని ఎటువంటి గాయాలు లేకుండా రక్షించారు.అధికారుల నుండి సంఘటన గురించి నివేదికలు అందిన తర్వాత, మంత్రిత్వ శాఖ ఎయిర్ వింగ్ మెడికల్, వైమానిక సిబ్బంది వేగంగా స్పందించి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి వారిని రక్షించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







