ఖతార్ రైలుకు ఆదరణ..1.8 మిలియన్ల మందికి సేవలు..!!
- April 10, 2025
దోహా: మార్చి 30 నుండి ఏప్రిల్ 7 వరకు ఈద్ అల్-ఫితర్ సెలవుల సమయంలో మొత్తం 1.81 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించినట్లు ఖతార్ రైలు ప్రకటించింది. కంపెనీ ప్రకటన ప్రకారం.. దోహా మెట్రో 1.7 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించగా, లుసైల్ ట్రామ్ అదే సమయంలో 110,000 మంది ప్రయాణికులకు సేవలందించింది.
అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో అల్ అజీజియా, డీఈసీసీ, లెగ్తైఫియా ఉన్నాయని ఖతార్ రైలు పేర్కొంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఖతార్ రైలు తన సేవల సమయాన్ని పొడిగించింది. దోహా మెట్రో ఇప్పుడు శనివారం నుండి గురువారం వరకు ఉదయం 5 నుండి ఉదయం 1 గంట వరకు, శుక్రవారం ఉదయం 9 నుండి ఉదయం 1 గంట వరకు పనిచేస్తుంది.
లుసైల్ ట్రామ్ శనివారం నుండి గురువారం వరకు ఉదయం 5 నుండి తెల్లవారుజామున 1:30 వరకు, శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి తెల్లవారుజామున 1:30 వరకు నడుస్తుంది. జనవరిలో, లుసైల్ ట్రామ్ నెట్వర్క్ కొత్త టర్కోయిస్ లైన్ ప్రారంభించారు.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్