ఖతార్ రైలుకు ఆదరణ..1.8 మిలియన్ల మందికి సేవలు..!!

- April 10, 2025 , by Maagulf
ఖతార్ రైలుకు ఆదరణ..1.8 మిలియన్ల మందికి సేవలు..!!

దోహా: మార్చి 30 నుండి ఏప్రిల్ 7 వరకు ఈద్ అల్-ఫితర్ సెలవుల సమయంలో మొత్తం 1.81 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించినట్లు ఖతార్ రైలు ప్రకటించింది. కంపెనీ ప్రకటన ప్రకారం.. దోహా మెట్రో 1.7 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించగా, లుసైల్ ట్రామ్ అదే సమయంలో 110,000 మంది ప్రయాణికులకు సేవలందించింది. 

అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో అల్ అజీజియా, డీఈసీసీ, లెగ్తైఫియా ఉన్నాయని ఖతార్ రైలు పేర్కొంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఖతార్ రైలు తన సేవల సమయాన్ని పొడిగించింది. దోహా మెట్రో ఇప్పుడు శనివారం నుండి గురువారం వరకు ఉదయం 5 నుండి ఉదయం 1 గంట వరకు, శుక్రవారం ఉదయం 9 నుండి ఉదయం 1 గంట వరకు పనిచేస్తుంది.

లుసైల్ ట్రామ్ శనివారం నుండి గురువారం వరకు ఉదయం 5 నుండి తెల్లవారుజామున 1:30 వరకు, శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి తెల్లవారుజామున 1:30 వరకు నడుస్తుంది. జనవరిలో, లుసైల్ ట్రామ్ నెట్‌వర్క్ కొత్త టర్కోయిస్ లైన్ ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com