ఖతార్ రైలుకు ఆదరణ..1.8 మిలియన్ల మందికి సేవలు..!!
- April 10, 2025
దోహా: మార్చి 30 నుండి ఏప్రిల్ 7 వరకు ఈద్ అల్-ఫితర్ సెలవుల సమయంలో మొత్తం 1.81 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించినట్లు ఖతార్ రైలు ప్రకటించింది. కంపెనీ ప్రకటన ప్రకారం.. దోహా మెట్రో 1.7 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించగా, లుసైల్ ట్రామ్ అదే సమయంలో 110,000 మంది ప్రయాణికులకు సేవలందించింది.
అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో అల్ అజీజియా, డీఈసీసీ, లెగ్తైఫియా ఉన్నాయని ఖతార్ రైలు పేర్కొంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఖతార్ రైలు తన సేవల సమయాన్ని పొడిగించింది. దోహా మెట్రో ఇప్పుడు శనివారం నుండి గురువారం వరకు ఉదయం 5 నుండి ఉదయం 1 గంట వరకు, శుక్రవారం ఉదయం 9 నుండి ఉదయం 1 గంట వరకు పనిచేస్తుంది.
లుసైల్ ట్రామ్ శనివారం నుండి గురువారం వరకు ఉదయం 5 నుండి తెల్లవారుజామున 1:30 వరకు, శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి తెల్లవారుజామున 1:30 వరకు నడుస్తుంది. జనవరిలో, లుసైల్ ట్రామ్ నెట్వర్క్ కొత్త టర్కోయిస్ లైన్ ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









