చైనాలో గాలులు, ఇసుక తుపాను..600 పైగా విమాన సర్వీసులు రద్దు
- April 12, 2025
చైనా: చైనాలో భీకర గాలులు, ఇసుక తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ గాలులతో రాజధాని బీజింగ్లో చెట్లు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. దాదాపు 693 విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.దీంతో బీజింగ్, డాక్సింగ్లో మధ్యాహ్నం వరకు వందలాది విమాన, రైల్వే సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది.అధికారులు పార్కులు తాత్కాలికంగా మూసేశారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో.. 75 ఏళ్లలో ఎన్నడూ లేని శక్తివంతమైన గాలులు వీచినట్లు కథనాలు పేర్కొన్నాయి.
ముఖ్యంగా దేశ ఉత్తర, తీర ప్రాంతాల్లో ప్రమాదకర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరించారు. ఈ గాలుల ప్రభావంతో ఫుట్బాల్ మ్యాచ్లు, ఇతర ముఖ్య కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకూడదని.. జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఇక ఈ తుపాను వల్ల ట్రాఫిక్ వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది. రోడ్లపై దృశ్యపటం తగ్గిపోయిన కారణంగా వాహనాల రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. పలు స్కూళ్లు, కార్యాలయాలు మూసివేయబడ్డాయి. రైలు సర్వీసులపై కూడా ప్రభావం చూపింది. వాతావరణ శాఖ ప్రకారం, ఇది మంగోలియా పరిధిలో ఏర్పడిన ఓ శక్తివంతమైన పిడుగు తుఫానుకు సంబంధించి ఉత్తర చైనా వైపుకు వచ్చిన ఇసుక తుఫానుల శ్రేణిలో ఒకటి. రాబోయే రెండు రోజుల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశముందని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం అత్యవసర సహాయ చర్యలు ప్రారంభించిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..