పాలస్తీనియన్ల డిస్ ప్లేస్మెంట్.. తిరస్కరించిన సౌదీ అరేబియా..!!
- April 13, 2025
అంటల్య: పాలస్తీనియన్ల బలవంతపు తరలింపును సంబంధించిన ఏ ప్రతిపాదననైనా తిరస్కరిస్తామని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ తేల్చిచెప్పారు. గాజా నివాసితులు జీవితంలోని ప్రాథమిక అవసరాలను కోల్పోతున్నారని ఆయన స్పష్టం చేశారు.
టర్కీలోని అంటాల్యలో జరిగిన గాజాపై యుద్ధాన్ని ముగించడానికి అంతర్జాతీయ జోక్యం కోసం ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలస్తీనియన్లను వారి భూమి నుండి తొలగించడాన్ని సౌదీ అరేబియా తిరస్కరించిందని ప్రిన్స్ ఫైసల్ పునరుద్ఘాటించారు.
గాజాలోకి మానవతా సహాయం అడ్డుకోవడం, కాల్పుల విరమణ ప్రయత్నాలను ఆయన విమర్శించారు. ఆటంకం లేకుండా సహాయాన్ని అందించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ఈజిప్ట్, ఖతార్ నేతృత్వంలోని మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ప్రశంసించారు. అనంరతం గాజా, వెస్ట్ బ్యాంక్ లేదా తూర్పు జెరూసలేం నుండి పాలస్తీనియన్లను బలవంతంగా తరలించడం లేదా బహిష్కరించడాన్ని ఖండిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









