వాహనదారులకు అలెర్ట్..ఇక AI-ఆధారిత కెమెరాలు ఫోకస్..!!
- April 13, 2025
మస్కట్: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకం రోడ్డు భద్రతకు ముప్పు కలిగించే ప్రధాన సవాళ్లలో ఒకటి. ఇది వాహనదారుల ప్రాణాలతోపాటు ఇతర వాహనదారులకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాగా, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకం వంటి ఉల్లంఘనలను గుర్తించడానికి రాయల్ ఒమన్ పోలీసులు అధునాతన స్మార్ట్ సిస్టమ్లను అమలు చేయడం ప్రారంభించారని రాయల్ ఒమన్ పోలీస్ ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఇంజనీర్ అలీ బిన్ హమౌద్ అల్-ఫలాహి అన్నారు.
AI-ఆధారిత కెమెరాలు ఇప్పుడు పనిచేస్తున్నాయని, అవి ఫోటోలను సమర్థంగా విశ్లేషించగలవని తెలిపారు. అధిక ఖచ్చితత్వంతో ఉల్లంఘనలను గుర్తించగలవని పేర్కొన్నారు. ఈ వ్యవస్థలు ట్రాఫిక్ ను పర్యవేక్షించడానికి సహాయపడతాయని, ఇప్పటికే వీటిని ఒమన్ రోడ్లపై విస్తృతంగా పరీక్షించినట్లు వివరించారు. ఇటువంటి సాంకేతికతలు ఉల్లంఘనలు, ప్రమాదాలను సమర్థవంతంగా తగ్గిస్తాయని బ్రిగేడియర్ అల్-ఫలాహి ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







