ఫ్లైట్ లో లిథియం బ్యాటరీ పేలుడు..ప్రయాణికులు షాక్..!!
- October 19, 2025
యూఏఈ: ఫ్లైట్ ఓవర్ హెడ్ బిన్లో లిథియం బ్యాటరీ లో పేలడంతో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఎయిర్ చైనా విమానం అత్యవసర ల్యాండింగ్ చేసింది. CA139 నంబర్ విమానం స్థానిక కాలమానం ప్రకారం అక్టోబర్ 18న ఉదయం 09.47 గంటలకు హాంగ్జౌ జియావోషన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరి, తెల్లవారుజామున 12.20 గంటలకు ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. ఆ తరువాత షాంఘైలో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది.
ఫ్లైట్ ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్లో ప్రయాణీకుల క్యారీ-ఆన్ లగేజీలోని లిథియం బ్యాటరీ ఆకస్మికంగా పేలిందని ఎయిర్ చైనా ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్లైట్ సిబ్బంది వెంటనే స్పందించారని. మంటలను అదుపుచేశారని పేర్కొంది. విమానం షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఎయిర్ లైన్ తెలిపింది.
కాగా, ఈ నెల ప్రారంభంలో ఎమిరేట్స్ పవర్ బ్యాంకుల వాడకాన్ని నిషేధించింది. అయితే, ప్రయాణీకులు ఇప్పటికీ 100 వాట్-గంటల (Wh) కంటే తక్కువ శక్తి కలిగిన ఒక పవర్ బ్యాంక్ను తీసుకెళ్లవచ్చు. కానీ ఆ పరికరాన్ని విమానంలో ఉపయోగించడానికి అనుమతించరు. లిథియం బ్యాటరీలతో ప్రమాదాల తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్లైన్ ప్రకటించింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







