మక్కాలోకి ప్రవేశం.. తస్రీహ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- April 15, 2025
రియాద్: సౌదీ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) భాగస్వామ్యంతో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. హజ్ పర్మిట్ల కోసం తస్రీహ్ అనే యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఈ పర్మిట్లను కలిగి ఉన్న దేశీయ, అంతర్జాతీయ యాత్రికులు మక్కా, పవిత్ర స్థలాలలోకి ప్రవేశించడానికి పర్మిట్లను జారీ చేయనున్నారు. నుసుక్ ప్లాట్ఫామ్ ద్వారా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖతో టెక్నాలజీ షేరింగ్ కారణంగా ఇది పనిచేయనుందని అధికారులు తెలిపారు. దీనిద్వారా హజ్ కార్యకలాపాలలో పాల్గొనే కార్మికులు, స్వచ్ఛంద సేవకులు, అలాగే వాటిని రవాణా చేసే వాహనాలకు మక్కా, పవిత్ర ప్రదేశాలలోకి ప్రవేశించడానికి తవక్కల్నా యాప్ ద్వారా అనుమతులను పొందవచ్చు. ఈ యాప్ హజ్లో పాల్గొన్న ప్రభుత్వం, సేవా సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ఇది సౌదీ విజన్ 2030 కార్యక్రమాలలో ఒకటైన డోయోఫ్ అల్-రెహ్మాన్ ప్రోగ్రామ్ లక్ష్యాలను నెరవేరుస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- ధోఫర్ ఖరీఫ్ సీజన్కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు







