మక్కాలోకి ప్రవేశం.. తస్రీహ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- April 15, 2025
రియాద్: సౌదీ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) భాగస్వామ్యంతో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. హజ్ పర్మిట్ల కోసం తస్రీహ్ అనే యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఈ పర్మిట్లను కలిగి ఉన్న దేశీయ, అంతర్జాతీయ యాత్రికులు మక్కా, పవిత్ర స్థలాలలోకి ప్రవేశించడానికి పర్మిట్లను జారీ చేయనున్నారు. నుసుక్ ప్లాట్ఫామ్ ద్వారా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖతో టెక్నాలజీ షేరింగ్ కారణంగా ఇది పనిచేయనుందని అధికారులు తెలిపారు. దీనిద్వారా హజ్ కార్యకలాపాలలో పాల్గొనే కార్మికులు, స్వచ్ఛంద సేవకులు, అలాగే వాటిని రవాణా చేసే వాహనాలకు మక్కా, పవిత్ర ప్రదేశాలలోకి ప్రవేశించడానికి తవక్కల్నా యాప్ ద్వారా అనుమతులను పొందవచ్చు. ఈ యాప్ హజ్లో పాల్గొన్న ప్రభుత్వం, సేవా సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ఇది సౌదీ విజన్ 2030 కార్యక్రమాలలో ఒకటైన డోయోఫ్ అల్-రెహ్మాన్ ప్రోగ్రామ్ లక్ష్యాలను నెరవేరుస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









