మక్కాలోకి ప్రవేశం.. తస్రీహ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- April 15, 2025
రియాద్: సౌదీ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) భాగస్వామ్యంతో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. హజ్ పర్మిట్ల కోసం తస్రీహ్ అనే యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఈ పర్మిట్లను కలిగి ఉన్న దేశీయ, అంతర్జాతీయ యాత్రికులు మక్కా, పవిత్ర స్థలాలలోకి ప్రవేశించడానికి పర్మిట్లను జారీ చేయనున్నారు. నుసుక్ ప్లాట్ఫామ్ ద్వారా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖతో టెక్నాలజీ షేరింగ్ కారణంగా ఇది పనిచేయనుందని అధికారులు తెలిపారు. దీనిద్వారా హజ్ కార్యకలాపాలలో పాల్గొనే కార్మికులు, స్వచ్ఛంద సేవకులు, అలాగే వాటిని రవాణా చేసే వాహనాలకు మక్కా, పవిత్ర ప్రదేశాలలోకి ప్రవేశించడానికి తవక్కల్నా యాప్ ద్వారా అనుమతులను పొందవచ్చు. ఈ యాప్ హజ్లో పాల్గొన్న ప్రభుత్వం, సేవా సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ఇది సౌదీ విజన్ 2030 కార్యక్రమాలలో ఒకటైన డోయోఫ్ అల్-రెహ్మాన్ ప్రోగ్రామ్ లక్ష్యాలను నెరవేరుస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







