దుబాయ్ లో ఘనంగా జరిగిన ముషాయిరా మరియు కవి సమ్మేళనం
- April 24, 2025
దుబాయ్: జస్న్ ఎ ఉర్దూను పురస్కరించుకుని 9వ వార్షిక ముషాయిరా & కవి సమ్మేళనం కార్యక్రమాన్ని ఈనెల ఏప్రిల్ 19, శనివారం రాత్రి 8 గంటల సమయంలో యూఏఈ దుబాయ్ లోని ఇండియన్ హై స్కూల్ నందు ఉన్న దుబాయ్ షేక్ రషీద్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బు అబ్దుల్లాహ్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ చైర్మన్ బు అబ్దుల్లాహ్ ముఖ్య అతిధిగా విచ్చేసారు.ప్రముఖ ఉర్దూ మరియు హిందీ భాషల కవులు ఈ కార్యక్రమంలో కవులు అలతి పదాలతో అల్లిన పద్యాలు, షాయిరీలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమానికి ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు.ఊహించిన దాని కంటే కార్యక్రమం బాగా విజయవంతం కావడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 9 ఏళ్లుగా దుబాయ్ ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని, మునుపటి కంటే ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్గారి దుబాయ్ లో ఒక ఈవెంట్ లో పాల్గొనడానికి విచ్చేసారు.ఈ సందర్భంగా షేక్ అబ్దుల్లా,ఫహీమ్,ఖాజా,షహరాన్ ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన్ను సన్మానించారు.
తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







