సౌదీలో స్పాన్సర్లకు 6 నెలల జైలుశిక్ష, SR50,000 జరిమానా..!!
- April 24, 2025
రియాద్: వారి స్పాన్సర్షిప్ కింద ఉన్న వలస కార్మికుల డిపార్చర్ ను నివేదించని స్పాన్సర్లకు వారి ప్రవేశ వీసాల గడువు ముగిసిన తర్వాత గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్ష, SR50,000 వరకు జరిమానా విధించబడుతుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విదేశీయుడైన స్పాన్సర్ జైలు శిక్ష, జరిమానా చెల్లించిన తర్వాత బహిష్కరించనున్నట్లు తెలిపారు. సౌదీ అరేబియా అధికారిక హజ్, ఉమ్రా మార్గదర్శకాల ప్రాముఖ్యతను కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది. వారి ప్రవేశ వీసాల గడువు ముగిసిన తర్వాత సౌదీ అరేబియాను విడిచి వెళ్లని ప్రవాసులకు SR50,000 వరకు జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష , బహిష్కరణ విధించవచ్చని పేర్కొంది. హజ్, ఉమ్రా సేవలను అందించే కంపెనీలు, సంస్థలు తమ వీసాల గడువు ముగిసిన తర్వాత హజ్ లేదా ఉమ్రా యాత్రికులను నివేదించడంలో విఫలమైతే మంత్రిత్వ శాఖ గతంలో గరిష్టంగా SR100,000 జరిమానాను ప్రకటించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







