యూఏఈ-ఇండియా ఫ్లైట్ సర్వీసులు ఆలస్యం..!!
- April 25, 2025
యూఏఈ: పాకిస్తాన్ గురువారం తన గగనతలాన్ని మూసివేసింది. దాంతో భారత విమానయాన సంస్థలు ప్రభావితం అయ్యాయి. పాక్ చర్యల కారణంగా యూఏఈ, ఇండియా మధ్య నడిచే ఫ్లైట్స్ ఆలస్యం అవుతున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది భారతీయ పర్యాటకులు మరణించిన తరువాత ఇస్లామాబాద్ , న్యూఢిల్లీ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ చర్యతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానయాన కారిడార్లలో ఒకటైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన భారతీయ నగరాలకు దుబాయ్, అబుదాబి, షార్జా నుండి అనేక రోజువారీ విమానాలు పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని ఉపయోగిస్తాయి. ఇప్పుడు మూసివేత అమలులోకి రావడంతో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగోతో సహా యూఏఈలో పనిచేస్తున్న భారతీయ విమానయాన సంస్థలు అరేబియా సముద్రం మీదుగా లేదా పొడవైన దక్షిణ మార్గాల ద్వారా వెళ్లవలసి ఉంటుంది. దీనివల్ల రెండు గంటల విమాన ప్రయాణ సమయం పెరుగుతుందని నిపుణులు తెలిపారు.
దుబాయ్కు చెందిన ఓరియంట్ ట్రావెల్స్లో సేల్స్ మరియు హాలిడేస్ జనరల్ మేనేజర్ వసీం రెహమానీ మాట్లాడుతూ.. రూటింగ్ ప్రధానంగా భారతీయ క్యారియర్లను ప్రభావితం చేస్తుందని అన్నారు. ఇంధన ఖర్చులు పెరగడం వల్ల భారతీయ ప్రయాణికులు ఎక్కువ విమాన వ్యవధిని, అధిక ఛార్జీలను ఎదుర్కోవలసి రావచ్చని తెలిపారు.రాబోయే రోజుల్లో యూఏఈ నుండి భారతదేశానికి ప్రయాణించే ప్రయాణీకులు తాజా అప్డేట్ ల కోసం వారి విమానయాన సంస్థలతో టచ్ లో ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి









