హైదరాబాద్ లో 208 మంది పాకిస్తానీయులు..
- April 25, 2025
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థానీయుల వీసాలు రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్లో పాకిస్థానీయుల వివరాల పై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్లో 208 మంది పాకిస్థానీయుల పేర్లు రిజిస్టర్ అయ్యాయి.
వీరిలో లాంగ్ టర్మ్ వీసా ఉన్నవాళ్లు 156 మంది, షార్ట్ టర్మ్ వీసా ఉన్నవాళ్లు 13 మంది, బిజినెస్ వీసాలతో ఉంటున్నవారు 39 మంది.కేంద్ర సర్కారు ఆదేశాల మేరకు వారంతా దేశం విడిచి వెళ్లి పోవాల్సి ఉంది. దీంతో స్పెషల్ బ్రాంచ్ అధికారులు అప్రమత్తమయ్యారు.
పాకిస్థాన్ ముర్దామాద్ నినాదాలు
మరోవైపు, పాకిస్థాన్ ముర్దామాద్ నినాదాలు, పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ఇవాళ ముస్లింలు పాకిస్థాన్ ముర్దామాద్ నినాదాలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ముస్లింలు వేలాది సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. ఇవాళ శుక్రవారం కావడంతో..ఎంఐఎం చీఫ్ అసరుద్దీన్ ఒవైసీ పిలుపుమేరకు నల్ల రిబ్బన్లను ధరించి ముస్లింలు నమాజ్ చేశారు.
కాగా, పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్ ఉగ్రవాదాన్ని సమూలంగా అంతమొందించాలనే సంకల్పంతో ముందుకు వెళుతోంది. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ తక్షణమే దౌత్యపరమైన ఒత్తిడిని పెంచడమే కాకుండా, భవిష్యత్తులో పాకిస్థాన్ ఆర్థికంగా కోలుకోలేకుండా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది.
అయినప్పటికీ, పహల్గాం ఘటనకు సంబంధించి నేరుగా ప్రమేయం ఉన్న ఉగ్రవాదులను శిక్షించాల్సిందేనని దేశవ్యాప్తంగా ప్రజల నుంచి గట్టిగా డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్పై నేరుగా ఎలా ప్రతీకారం తీర్చుకోవచ్చన్నదే ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది. సైనిక చర్య విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం చాలా సమగ్రంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్లో ఉంటున్న పాకిస్థానీయులను వెనక్కి పంపించాలని కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









