తెలంగాణ భవన్ వద్ద కలకలం..

- April 29, 2025 , by Maagulf
తెలంగాణ భవన్ వద్ద కలకలం..

హైదరాబాద్: హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద కలకలం రేగింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కటౌట్ కి నిప్పు పెట్టేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతడిని అడ్డుకున్నారు.ఈ ఘటనలో కేసీఆర్ కటౌట్ స్వల్పంగా కాలింది.

దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కటౌట్ కి నిప్పు పెట్టేందుకు ఎందుకు యత్నించారో ఆరా తీశారు. కాగా, కేసీఆర్ కటౌట్ కి నిప్పు పెట్టిన వ్యక్తి.. మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. అతడిని తిరుపతి ప్రాంతానికి చెందిన రాజాగా గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com