తెలంగాణ భవన్ వద్ద కలకలం..
- April 29, 2025
హైదరాబాద్: హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద కలకలం రేగింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కటౌట్ కి నిప్పు పెట్టేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతడిని అడ్డుకున్నారు.ఈ ఘటనలో కేసీఆర్ కటౌట్ స్వల్పంగా కాలింది.
దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కటౌట్ కి నిప్పు పెట్టేందుకు ఎందుకు యత్నించారో ఆరా తీశారు. కాగా, కేసీఆర్ కటౌట్ కి నిప్పు పెట్టిన వ్యక్తి.. మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. అతడిని తిరుపతి ప్రాంతానికి చెందిన రాజాగా గుర్తించారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్