తెలంగాణ భవన్ వద్ద కలకలం..
- April 29, 2025
హైదరాబాద్: హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద కలకలం రేగింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కటౌట్ కి నిప్పు పెట్టేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతడిని అడ్డుకున్నారు.ఈ ఘటనలో కేసీఆర్ కటౌట్ స్వల్పంగా కాలింది.
దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కటౌట్ కి నిప్పు పెట్టేందుకు ఎందుకు యత్నించారో ఆరా తీశారు. కాగా, కేసీఆర్ కటౌట్ కి నిప్పు పెట్టిన వ్యక్తి.. మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. అతడిని తిరుపతి ప్రాంతానికి చెందిన రాజాగా గుర్తించారు.
తాజా వార్తలు
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!









