ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- April 30, 2025
సోహార్ : 2025 మే 29-31 తేదీలలో మలేషియాలోని కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న అంతర్జాతీయ ఇన్నోవేషన్, సాంకేతిక ప్రదర్శన (ITEX 2025)లో ఒమన్ సుల్తానేట్కు ప్రాతినిధ్యం వహించే ముగ్గురు అర్హత సాధించినవారి పేర్లను ఉన్నత విద్య, పరిశోధన, ఇన్నోవేషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ప్రకటన కార్యక్రమం సోహార్ విశ్వవిద్యాలయంలో నార్త్ అల్ బటినా గవర్నర్ మొహమ్మద్ సులేమాన్ అల్ కిండి ఆధ్వర్యంలో జరిగింది. ఉన్నత విద్య, పరిశోధన, పరిశోధన, ఆవిష్కరణల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ సైఫ్ అబ్దుల్లా అల్ హద్దాబీ సమక్షంలో జరిగింది.
ఎంపిక చేసిన ముగ్గురు వివరాలు: “స్క్విడ్ ఇంక్ వాటర్ ఫిల్టర్” ప్రాజెక్ట్ కోసం యూస్రా యూసుఫ్ అల్ గదానీ, “పోర్ట్ ల్యాండ్ సిమెంట్ రీన్ఫోర్స్డ్ విత్ కార్బన్ నానోషీట్స్ యాజ్ ఎ డెంటల్ ఫిల్లింగ్” అనే ఆవిష్కరణ కోసం మలక్ ఖలీఫా అల్ హార్తీ, “రింగ్ మెయిన్ యూనిట్ ఆపరేషన్ కోసం రిమోట్ కంట్రోల్ డివైస్” ప్రాజెక్ట్ కోసం బదర్ సలీం అల్ ముక్బాలి లు ఎంపికైనట్టు ప్రకటించారు.
ఈ ప్రదర్శనలో ఆసియా, యూరప్లోని 20 కి పైగా దేశాల నుండి పాల్గొంటున్నారు. వివిధ వర్గాలలో 1,000 కి పైగా ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









