ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- April 30, 2025
సోహార్ : 2025 మే 29-31 తేదీలలో మలేషియాలోని కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న అంతర్జాతీయ ఇన్నోవేషన్, సాంకేతిక ప్రదర్శన (ITEX 2025)లో ఒమన్ సుల్తానేట్కు ప్రాతినిధ్యం వహించే ముగ్గురు అర్హత సాధించినవారి పేర్లను ఉన్నత విద్య, పరిశోధన, ఇన్నోవేషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ప్రకటన కార్యక్రమం సోహార్ విశ్వవిద్యాలయంలో నార్త్ అల్ బటినా గవర్నర్ మొహమ్మద్ సులేమాన్ అల్ కిండి ఆధ్వర్యంలో జరిగింది. ఉన్నత విద్య, పరిశోధన, పరిశోధన, ఆవిష్కరణల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ సైఫ్ అబ్దుల్లా అల్ హద్దాబీ సమక్షంలో జరిగింది.
ఎంపిక చేసిన ముగ్గురు వివరాలు: “స్క్విడ్ ఇంక్ వాటర్ ఫిల్టర్” ప్రాజెక్ట్ కోసం యూస్రా యూసుఫ్ అల్ గదానీ, “పోర్ట్ ల్యాండ్ సిమెంట్ రీన్ఫోర్స్డ్ విత్ కార్బన్ నానోషీట్స్ యాజ్ ఎ డెంటల్ ఫిల్లింగ్” అనే ఆవిష్కరణ కోసం మలక్ ఖలీఫా అల్ హార్తీ, “రింగ్ మెయిన్ యూనిట్ ఆపరేషన్ కోసం రిమోట్ కంట్రోల్ డివైస్” ప్రాజెక్ట్ కోసం బదర్ సలీం అల్ ముక్బాలి లు ఎంపికైనట్టు ప్రకటించారు.
ఈ ప్రదర్శనలో ఆసియా, యూరప్లోని 20 కి పైగా దేశాల నుండి పాల్గొంటున్నారు. వివిధ వర్గాలలో 1,000 కి పైగా ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







