అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- March 04, 2026
యూఏఈ: దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. ఈ ఘటనలో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుందని, వాటిని రెస్క్యూ టీమ్స్ ఆర్పివేశారని దుబాయ్ అధికారులు తెలిపారు.ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్ ను నమ్మొద్దని కోరింది. ఎమర్జెన్సీ సమయంలో ఫోటోలు, వీడియోలు తీయవద్దని, వాటిని సోషల్ మీడియాలో ఫోస్ట్ చేయవద్దని తెలిపింది.
ఇరాన్ ఇప్పటివరకు ప్రయోగించిన 186 బాలిస్టిక్ క్షిపణులను గుర్తించామని, 172 క్షిపణులు ధ్వంసం చేశామని తెలిపింది. వాటిలో 13 సముద్రంలో పడ్డాయని, ఒక క్షిపణి భూభాగంపై పడిందని తెలిపింది. అలాగే, 812 ఇరానియన్ డ్రోన్లను గుర్తించామని, 755 డ్రోన్లను కూల్చివేశామని, 57 దేశ భూభాగంలోకి పడ్డాయని వెల్లడించారు. ఇంకా, 8 క్రూయిజ్ క్షిపణులను గుర్తించి డెస్ట్రాయ్ చేశామని, దీనివల్ల కొంత నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఇరాన్ దాడుల్లో పాకిస్తానీ, నేపాల్ మరియు బంగ్లాదేశ్ జాతీయులు ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు.
అలాగే, ఎమిరాటీ, ఈజిప్షియన్, ఇథియోపియన్, ఫిలిప్పీన్స్, పాకిస్తానీ, ఇరానియన్, ఇండియన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అజర్బైజాన్, యెమెన్, ఉగాండా, ఎరిట్రియన్, లెబనీస్ మరియు ఆఫ్ఘన్ జాతీయులలో 68 మందికి స్వల్ప గాయాలు అయినట్లు దుబాయ్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









