అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- March 04, 2026
యూఏఈ: దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. ఈ ఘటనలో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుందని, వాటిని రెస్క్యూ టీమ్స్ ఆర్పివేశారని దుబాయ్ అధికారులు తెలిపారు.ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్ ను నమ్మొద్దని కోరింది. ఎమర్జెన్సీ సమయంలో ఫోటోలు, వీడియోలు తీయవద్దని, వాటిని సోషల్ మీడియాలో ఫోస్ట్ చేయవద్దని తెలిపింది.
ఇరాన్ ఇప్పటివరకు ప్రయోగించిన 186 బాలిస్టిక్ క్షిపణులను గుర్తించామని, 172 క్షిపణులు ధ్వంసం చేశామని తెలిపింది. వాటిలో 13 సముద్రంలో పడ్డాయని, ఒక క్షిపణి భూభాగంపై పడిందని తెలిపింది. అలాగే, 812 ఇరానియన్ డ్రోన్లను గుర్తించామని, 755 డ్రోన్లను కూల్చివేశామని, 57 దేశ భూభాగంలోకి పడ్డాయని వెల్లడించారు. ఇంకా, 8 క్రూయిజ్ క్షిపణులను గుర్తించి డెస్ట్రాయ్ చేశామని, దీనివల్ల కొంత నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఇరాన్ దాడుల్లో పాకిస్తానీ, నేపాల్ మరియు బంగ్లాదేశ్ జాతీయులు ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు.
అలాగే, ఎమిరాటీ, ఈజిప్షియన్, ఇథియోపియన్, ఫిలిప్పీన్స్, పాకిస్తానీ, ఇరానియన్, ఇండియన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అజర్బైజాన్, యెమెన్, ఉగాండా, ఎరిట్రియన్, లెబనీస్ మరియు ఆఫ్ఘన్ జాతీయులలో 68 మందికి స్వల్ప గాయాలు అయినట్లు దుబాయ్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







