అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- March 04, 2026
యూఏఈ: దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. ఈ ఘటనలో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుందని, వాటిని రెస్క్యూ టీమ్స్ ఆర్పివేశారని దుబాయ్ అధికారులు తెలిపారు.ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్ ను నమ్మొద్దని కోరింది. ఎమర్జెన్సీ సమయంలో ఫోటోలు, వీడియోలు తీయవద్దని, వాటిని సోషల్ మీడియాలో ఫోస్ట్ చేయవద్దని తెలిపింది.
ఇరాన్ ఇప్పటివరకు ప్రయోగించిన 186 బాలిస్టిక్ క్షిపణులను గుర్తించామని, 172 క్షిపణులు ధ్వంసం చేశామని తెలిపింది. వాటిలో 13 సముద్రంలో పడ్డాయని, ఒక క్షిపణి భూభాగంపై పడిందని తెలిపింది. అలాగే, 812 ఇరానియన్ డ్రోన్లను గుర్తించామని, 755 డ్రోన్లను కూల్చివేశామని, 57 దేశ భూభాగంలోకి పడ్డాయని వెల్లడించారు. ఇంకా, 8 క్రూయిజ్ క్షిపణులను గుర్తించి డెస్ట్రాయ్ చేశామని, దీనివల్ల కొంత నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఇరాన్ దాడుల్లో పాకిస్తానీ, నేపాల్ మరియు బంగ్లాదేశ్ జాతీయులు ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు.
అలాగే, ఎమిరాటీ, ఈజిప్షియన్, ఇథియోపియన్, ఫిలిప్పీన్స్, పాకిస్తానీ, ఇరానియన్, ఇండియన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అజర్బైజాన్, యెమెన్, ఉగాండా, ఎరిట్రియన్, లెబనీస్ మరియు ఆఫ్ఘన్ జాతీయులలో 68 మందికి స్వల్ప గాయాలు అయినట్లు దుబాయ్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









