1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- March 04, 2026
యూఏఈ: ఇరాన్ తన వైఖరి మార్చుకోవడం లేదని యూఏఈ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 1,000 కి పైగా దాడులు చేసిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర దేశాల కంటే యూఏఈ నే ఇరాన్ ఎక్కువగా టార్గెట్ చేసిందని పేర్కొంది.
"యూఏఈ వెయ్యికి పైగా దాడులకు గురైంది. ఈ సంఖ్య ఇతర అన్ని దేశాలు ఎదుర్కొన్న దాడుల మొత్తాన్ని మించిపోయింది. మన సాయుధ దళాలు ఈ దాడులకు అత్యంత నైపుణ్యం, సామర్థ్యంతో ఎదుర్కొంది." అని వెల్లడించింది.
యూఏఈ యుద్ధంలో పాల్గొనలేదని, ఇరాన్పై జరిగిన ఏ దాడిలోనూ తన భూభాగం, ప్రాదేశిక జలాలు లేదా గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించలేదని గుర్తుచేసింది.ఈ విషయాన్ని ఇరాన్ గుర్తించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.ఉద్రిక్తతలను తగ్గించే విధానాలకు యూఏఈ మద్దతు ఇస్తుందని మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్కు కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









