1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- March 04, 2026
యూఏఈ: ఇరాన్ తన వైఖరి మార్చుకోవడం లేదని యూఏఈ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 1,000 కి పైగా దాడులు చేసిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర దేశాల కంటే యూఏఈ నే ఇరాన్ ఎక్కువగా టార్గెట్ చేసిందని పేర్కొంది.
"యూఏఈ వెయ్యికి పైగా దాడులకు గురైంది. ఈ సంఖ్య ఇతర అన్ని దేశాలు ఎదుర్కొన్న దాడుల మొత్తాన్ని మించిపోయింది. మన సాయుధ దళాలు ఈ దాడులకు అత్యంత నైపుణ్యం, సామర్థ్యంతో ఎదుర్కొంది." అని వెల్లడించింది.
యూఏఈ యుద్ధంలో పాల్గొనలేదని, ఇరాన్పై జరిగిన ఏ దాడిలోనూ తన భూభాగం, ప్రాదేశిక జలాలు లేదా గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించలేదని గుర్తుచేసింది.ఈ విషయాన్ని ఇరాన్ గుర్తించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.ఉద్రిక్తతలను తగ్గించే విధానాలకు యూఏఈ మద్దతు ఇస్తుందని మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్కు కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









