1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- March 04, 2026
యూఏఈ: ఇరాన్ తన వైఖరి మార్చుకోవడం లేదని యూఏఈ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 1,000 కి పైగా దాడులు చేసిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర దేశాల కంటే యూఏఈ నే ఇరాన్ ఎక్కువగా టార్గెట్ చేసిందని పేర్కొంది.
"యూఏఈ వెయ్యికి పైగా దాడులకు గురైంది. ఈ సంఖ్య ఇతర అన్ని దేశాలు ఎదుర్కొన్న దాడుల మొత్తాన్ని మించిపోయింది. మన సాయుధ దళాలు ఈ దాడులకు అత్యంత నైపుణ్యం, సామర్థ్యంతో ఎదుర్కొంది." అని వెల్లడించింది.
యూఏఈ యుద్ధంలో పాల్గొనలేదని, ఇరాన్పై జరిగిన ఏ దాడిలోనూ తన భూభాగం, ప్రాదేశిక జలాలు లేదా గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించలేదని గుర్తుచేసింది.ఈ విషయాన్ని ఇరాన్ గుర్తించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.ఉద్రిక్తతలను తగ్గించే విధానాలకు యూఏఈ మద్దతు ఇస్తుందని మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్కు కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









