తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల..
- April 30, 2025
హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని రవీంద్ర భారతి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. జీపీఏ ఈ సారి తొలగించడంతో సబ్జెక్టుల వారీగా మార్కుల గ్రేడ్లు ఇచ్చారు.
ఉత్తీర్ణతకు కావాల్సిన మార్కులు వస్తే పాస్ అని మోమోపై ఉంటుంది. ఉత్తీర్ణత సాధించలేకపోతే ఫెయిల్ అని అందులో ఇచ్చారు. ఇంతకు ముందు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ విధానాన్ని పాటించిన విషయం తెలిసిందే.
టెన్త్ ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది కంటే 1.47 శాతం ఉత్తీర్ణత అధికంగా ఉంది. ప్రైవేటు స్కూళ్లలో 94.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని పాఠశాలలు రెండు ఉన్నాయి.
ప్రైవేటు స్కూళ్లలో గత ఏడాది కంటే ఈ సారి 4 శాతం అధికంగా ఉత్తీర్ణత నమోదైంది. గురుకుల పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 98.7గా ఉంది. కాగా, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరిగాయి. పరీక్షలను 5,09,403 మంది విద్యార్థులు రాశారు.
అధికారిక వెబ్సైట్లు
తాజా వార్తలు
- నిర్దిష్ట సమయాల్లోనే ప్రోటోకాల్ దర్శనం
- హైదరాబాద్కు 800 ఈవీ బస్సులు కేటాయించండి..
- సినీపరిశ్రమ పై డిప్యూటీ సీఎం కౌంటర్..
- పారిస్లో ఫ్రెంచ్, సౌదీ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- ద్వైపాక్షిక చర్చల కోసం బహ్రెయిన్ కు చేరుకున్న భారత ప్రతినిధి బృందం..!!
- యూఏఈలో ఈద్ అల్ అధా ఎప్పుడు? జుల్ హిజ్జా మొదటి రోజు వెల్లడి..!!
- ఒమన్లో మునిగిపోతున్న చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- ఎత్తైన జెండా స్తంభాన్ని ప్రారంభించిన ఒమన్..!!
- దుబాయ్ విమానాశ్రయంలో పార్క్ చేసిన కారులో మంటలు..!!
- యూఏఈలో దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో ‘మే’ ఉష్ణోగ్రతలు..!!