ఉక్రెయిన్ జర్నలిస్ట్ విక్టోరియాకు జోహార్లు
- May 01, 2025
ఉక్రెయిన్: కిడ్నాప్ కు గురైన డేరింగ్ డాషింగ్ యువ జర్నలిస్ట్ విక్టోరియా భౌతికకాయం బ్యాగ్ లో తిరిగి ఉక్రెయిన్ కు పంపించాయి రష్యా బలగాలు! కానీ, ఆమె కళ్ళు, మెదడు, స్వర పేటిక లేవని డైలీ మెయిల్ పత్రిక వెల్లడించింది! ఇది దురదృష్టకరం, చాలా విచారకరం! ప్రపంచ వ్యాప్తంగా జర్నలిస్టులకు బ్లాక్ డే!
ఉక్రెయిన్ యుద్దాన్ని, అక్కడి రష్యన్ బలగాల ఘోరాన్ని ఎప్పటికప్పుడు సాహసోపేతంగా ప్రపంచానికి తెలియచేసిన జర్నలిస్ట్ విక్టోరియా రోస్చినాను రష్యన్ సైనికులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే! నిన్న ఆమె భౌతిక కాయాన్ని బ్యాగులో కుక్కి ఉక్రెయిన్ కు పంపించారు! రష్యా జైలులో ఆమెను దారుణంగా చిత్రహింస కు గురి చేసినట్లు ఆమె భౌతికకాయాన్ని చూస్తే అర్ధమవుతున్నదని ఉక్రెయిన్ సైనికాధికారి వివరించారు. రష్యన్ దళాల దారుణ హింస బయటకు రాకుండా ఉండేందుకు ఆమె మెదడు, కళ్ళు తొలగించి ఉండొచ్చని కైవ్ లోని అధికారులు ప్రకటించారు.
మానవ హక్కుల ఉల్లంఘనలను దాచేందుకు పరిమితులకు మించి హింసించిన ఖైదీల శరీర భాగాలను తొలగించడం రష్యాలో ఉన్న ఒక సర్వ సాధారణ విషయం! ఉజ్వల భవిష్యత్ వున్న జర్నలిస్ట్ విక్టోరియా 27 ఏళ్లకే ఇలా దారుణ హింసకు గురై చివరకు ప్రాణాలు కోల్పోయి బాడీ బ్యాగ్ లో వెనక్కి రావడం ఘోరమైన చర్య! ప్రతి ఒక్కరూ ముక్తకంఠం తో ఖండించాలి. ఇప్పటికే ఉత్తమ జర్నలిస్టుగా అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ధైర్యమైన ధీర విక్టోరియాకు జోహార్లు, నివాళి.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







