6 రూపాయల టికెట్ బ్లాక్ లో 210 రూపాయలకు కొన్న అభిమాని..
- May 04, 2025
ఇప్పుడంటే టికెట్ రేట్లు వందల్లో ఉంటున్నాయి కానీ ఒకప్పుడు టికెట్ రేట్లు రూపాయి నుంచి 10 రూపాయలు రేట్లు కూడా ఉండేవని తెలిసిందే. తాజాగా మెగాస్టార్ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు మూవీ యూనిట్.
మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మే 9న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను మూవీ యూనిట్ పంచుకుంటున్నారు. తాజాగా మూవీ యూనిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజయినప్పుడు ఈ సినిమా పెద్ద హిట్ అయి భారీ డిమాండ్ ఉండటంతో ఆరు రూపాయల టికెట్ ని 210 రూపాయలకు బ్లాక్ లో అమ్మారు అని అప్పటి పేపర్లో పడిన విషయాన్ని షేర్ చేసారు.
అప్పట్లో సూపర్ హిట్ సినిమాలకు బాగా డిమాండ్ ఉంటె ఫ్యాన్స్ బ్లాక్ లో టికెట్స్ కొనుక్కొని మరీ వెళ్లేవారు. అలా ఓ చిరంజీవి అభిమాని సినిమా చూడటానికి ఆరు రూపాయల టికెట్ 210 రూపాయలు పెట్టి కొనుక్కొని చూసాడంటే మాములు విషయం కాదు. అదీ కదా మెగాస్టార్ రేంజ్ అంటే.
చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సోషియో ఫాంటసీగా తెరకెక్కింది. 1990ల్లో 2 కోట్లు పెట్టి తీస్తే ఈ సినిమా అప్పట్లోనే 15 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి ఇప్పుడు రీ రిలీజ్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎన్ని రికార్డులు కొడుతుందో చూడాలి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







