6 రూపాయల టికెట్ బ్లాక్ లో 210 రూపాయలకు కొన్న అభిమాని..
- May 04, 2025
ఇప్పుడంటే టికెట్ రేట్లు వందల్లో ఉంటున్నాయి కానీ ఒకప్పుడు టికెట్ రేట్లు రూపాయి నుంచి 10 రూపాయలు రేట్లు కూడా ఉండేవని తెలిసిందే. తాజాగా మెగాస్టార్ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు మూవీ యూనిట్.
మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మే 9న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను మూవీ యూనిట్ పంచుకుంటున్నారు. తాజాగా మూవీ యూనిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజయినప్పుడు ఈ సినిమా పెద్ద హిట్ అయి భారీ డిమాండ్ ఉండటంతో ఆరు రూపాయల టికెట్ ని 210 రూపాయలకు బ్లాక్ లో అమ్మారు అని అప్పటి పేపర్లో పడిన విషయాన్ని షేర్ చేసారు.
అప్పట్లో సూపర్ హిట్ సినిమాలకు బాగా డిమాండ్ ఉంటె ఫ్యాన్స్ బ్లాక్ లో టికెట్స్ కొనుక్కొని మరీ వెళ్లేవారు. అలా ఓ చిరంజీవి అభిమాని సినిమా చూడటానికి ఆరు రూపాయల టికెట్ 210 రూపాయలు పెట్టి కొనుక్కొని చూసాడంటే మాములు విషయం కాదు. అదీ కదా మెగాస్టార్ రేంజ్ అంటే.
చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సోషియో ఫాంటసీగా తెరకెక్కింది. 1990ల్లో 2 కోట్లు పెట్టి తీస్తే ఈ సినిమా అప్పట్లోనే 15 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి ఇప్పుడు రీ రిలీజ్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎన్ని రికార్డులు కొడుతుందో చూడాలి.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







