6 రూపాయల టికెట్ బ్లాక్ లో 210 రూపాయలకు కొన్న అభిమాని..
- May 04, 2025
ఇప్పుడంటే టికెట్ రేట్లు వందల్లో ఉంటున్నాయి కానీ ఒకప్పుడు టికెట్ రేట్లు రూపాయి నుంచి 10 రూపాయలు రేట్లు కూడా ఉండేవని తెలిసిందే. తాజాగా మెగాస్టార్ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు మూవీ యూనిట్.
మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మే 9న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను మూవీ యూనిట్ పంచుకుంటున్నారు. తాజాగా మూవీ యూనిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజయినప్పుడు ఈ సినిమా పెద్ద హిట్ అయి భారీ డిమాండ్ ఉండటంతో ఆరు రూపాయల టికెట్ ని 210 రూపాయలకు బ్లాక్ లో అమ్మారు అని అప్పటి పేపర్లో పడిన విషయాన్ని షేర్ చేసారు.
అప్పట్లో సూపర్ హిట్ సినిమాలకు బాగా డిమాండ్ ఉంటె ఫ్యాన్స్ బ్లాక్ లో టికెట్స్ కొనుక్కొని మరీ వెళ్లేవారు. అలా ఓ చిరంజీవి అభిమాని సినిమా చూడటానికి ఆరు రూపాయల టికెట్ 210 రూపాయలు పెట్టి కొనుక్కొని చూసాడంటే మాములు విషయం కాదు. అదీ కదా మెగాస్టార్ రేంజ్ అంటే.
చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సోషియో ఫాంటసీగా తెరకెక్కింది. 1990ల్లో 2 కోట్లు పెట్టి తీస్తే ఈ సినిమా అప్పట్లోనే 15 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి ఇప్పుడు రీ రిలీజ్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎన్ని రికార్డులు కొడుతుందో చూడాలి.
తాజా వార్తలు
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!









