మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- August 15, 2026
మస్కట్: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఒమన్ రాజధాని మస్కట్లోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వెయ్యి మందికి పైగా భారతీయ ప్రవాసులు కార్యక్రమానికి హాజరై దేశభక్తిని చాటారు.
ఇండియన్ స్కూల్ అల్ మాబెలా విద్యార్థులు ఆలపించిన ‘వందే మాతరం’తో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఒమన్లో భారత రాయబారి ప్రశాంత్ పిసే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ‘సూర్య పథ్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఈ వేడుకలను నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా భారత త్రివర్ణ పతాకాన్ని డిజిటల్ రిలే ద్వారా ప్రదర్శించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.
జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం రాయబారి ప్రశాంత్ పిసే సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాష్ట్రపతి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలను వివరించారు. దేశ ప్రగతి, భవిష్యత్ లక్ష్యాలను ప్రస్తావించారు.
వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భారతీయ సమాజాన్ని అలరించాయి. వివిధ రంగాల్లో భారతీయుల ప్రతిభను ప్రదర్శించే కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఒమన్లోని భారతీయ కార్మికులు అందిస్తున్న విలువైన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఇండియన్ కమ్యూనిటీ భారత్-ఒమన్ సంబంధాల బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా రాయబార కార్యాలయం పలు కార్యక్రమాలు నిర్వహించింది. పెయింటింగ్ పోటీ, క్విజ్ పోటీ, ‘భారత్ కో జానియే’ (BKJ) క్విజ్, ‘ఇండియా త్రూ మై లెన్స్’ ఫొటోగ్రఫీ పోటీ, ఫడ్ పెయింటింగ్ వర్క్షాప్, ‘మై ఇండియా, మై స్టోరీ’ కార్యక్రమాలను చేపట్టింది. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యస్ఫూర్తితో ఈ కార్యక్రమాలను నిర్వహించారు.
పోటీల్లో విజేతలు, ప్రతిభ కనబరిచిన వారిని రాయబారి సత్కరించారు. సైన్స్ ఇండియా ఫోరమ్తో అనుబంధం ఉన్న విద్యార్థులతో పాటు ఒమన్లోని భారతీయ పాఠశాలల్లో విద్యా, ఇతర రంగాల్లో ప్రతిభ చూపిన వారికి పురస్కారాలు అందజేశారు.
‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య దిశగా భారత్ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఒమన్లోని భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు మస్కట్లోని భారత రాయబార కార్యాలయం 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది.
తాజా వార్తలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు







